Apricots : హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్.. ఎలా పిలిచినా సరే.. ఈ సమస్య ప్రస్తుత తరుణంలో కామన్ అయిపోయింది. చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా హైబీపీ వస్తోంది. హైబీపీ వచ్చిన వారిలో రక్తనాళాల్లో గోడలకు రక్తం ఎక్కువ పీడనంతో పంప్ అవుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఈ సమస్య వల్ల రక్తనాళాలు దెబ్బ తింటాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ లేదా గుండె జబ్బులు వస్తాయి. దీనివల్ల ప్రాణాపాయ పరిస్థితులు సంభవిస్తాయి. అయితే హైబీపీ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
నిత్యం ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండడం, సరైన టైముకు తిండి తినకపోవడం, సరిగ్గా నిద్రించకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం అలాగే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల కూడా హైబీపీ వస్తుంది. చాలా మంది డాక్టర్లు కూడా హైబీపీ సమస్యకు ఉప్పును అధికంగా తీసుకోవడమే ప్రధాన కారణమని చెబుతుంటారు. అందువల్ల ఉప్పును తగ్గించాలని సూచిస్తుంటారు. ఉప్పు ఎక్కువైతే శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో రక్తనాళాల్లో నీరు చేరుతుంది. ఇలా రక్త నాళాల్లో నీరు చేరడం వల్ల రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి బీపీ పెరుగుతుంది. ఈ విధంగా ఉప్పు ఎక్కువ అవడం వల్ల అనర్థం జరుగుతుంది.
అయితే రక్తనాళాల్లో ఎక్కువగా ఉండే సోడియంను బయటకు పంపేందుకు పొటాషియం ఎంతగానో ఉపయోగపడుతుంది. పొటాషియం ఉండే ఆహారాలను గనక మనం రోజూ తింటే మన రక్త నాళాల్లో ఉండే సోడియం మూత్రం ద్వారా బయటకు పోతుంది. అందువల్ల పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ఇక బీపీ సమస్య ఉన్నవారిని అరటి పండ్లు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఒక 100 గ్రాముల అరటి పండును గనుక మనం తింటే మనకు దాదాపుగా 300 మిల్లీ గ్రాముల మేర పొటాషియం లభిస్తుంది. అందువల్ల బీపీ ఎక్కువగా ఉన్నవారు అరటి పండ్లను తింటే వెంటనే బీపీ అదుపులోకి వచ్చేస్తుంది.
ఇక అరటి పండు కన్నా యాప్రికాట్లలో పొటాషియం 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల మేర యాప్రికాట్లను తింటే సుమారుగా 1162 మిల్లీగ్రాముల మేర పొటాషియం లభిస్తుంది. అందువల్ల గుప్పెడు యాప్రికాట్లను తింటే బీపీ వెంటనే అదుపులోకి వస్తుంది. ఇలా ఈ రెండు రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ ఉన్నవారు చింతించాల్సిన పనిలేదు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ పండ్ల ద్వారా ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. కనుక అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…