Rose Sharbat : గులాబీ పువ్వులు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వీటిని జడలో పెట్టుకుని మురిసిపోతుంటారు. అలాగే దేవతా పూజలకు కూడా గులాబీలను ఉపయోగిస్తుంటారు. అయితే మీకు తెలుసా.. గులాబీ పువ్వుల రెక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని పలు ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే గులాబీ పువ్వుల రెక్కలతో మనం ఎంచక్కా షర్బత్ను కూడా తయారు చేసి తాగవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గులాబీ షర్బత్ తయారీకి కావల్సిన పదార్ధాలు..
గులాబీ రేకులు – ఒకటిన్నర కప్పులు, మరిగించిన నీళ్లు – ముప్పావు కప్పు, యాలకుల గింజలు – 1/4 టీస్పూన్, చక్కెర – ముప్పావు కప్పు, నిమ్మరసం – 1/4 కప్పు, దానిమ్మ గింజల రసం – ముప్పావు కప్పు,చల్లని నీళ్లు – 5 కప్పులు.
గులాబీ షర్బత్ తయారు చేసే విధానం..
ముందుగా గులాబీ రేకులను మెత్తగా నూరుకోవాలి. ఆ తరువాత ఆ ముద్దను గిన్నెలో వేసి అందులో మరిగించిన నీళ్లు పోయాలి. అనంతరం యాలకుల గింజలు కూడా వేసి మూత పెట్టి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ గులాబీ నీటిని పలుచని వస్త్రంతో వడకట్టుకోవాలి. అనంతరం వచ్చే ద్రవంలో చక్కెర వేసి బాగా కలపాలి. తరువాత వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకుని అందులో వేడినీరు పోసి గులాబీ నీరు ఉన్న గిన్నెను అందులో ఉంచి చక్కెర కరిగే వరకు వేచి చూడాలి. తరువాత గిన్నెను బయటకు తీసి అందులో ఉన్న ద్రవాన్ని వడకట్టి చల్లార్చుకోవాలి. అనంతరం అందులో దానిమ్మ రసం, నిమ్మరసం, చల్లని నీళ్లు కలిపి గ్లాసుల్లో పోయాలి. అవసరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. దీంతో చల్ల చల్లని గులాబీ షర్బత్ తయారవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ షర్బత్ను తీసుకుంటే శరీరంలోని వేడి ఇట్టే తగ్గిపోతుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…