lifestyle

Easter Ireland Sculptures : మౌనంగా చూస్తూ ఉండే శిల్పాలు.. వీటి వెనుక ఉన్న క‌థేమిటో తెలుసా..?

Easter Ireland Sculptures : క‌నుచూపు మేర‌లో ఎక్క‌డ చూసినా ప‌ర్వ‌తాల‌పై ప‌రుచుకున్న ప‌చ్చ‌ని గ‌డ్డి. చూద్దామంటే చెట్లు మ‌చ్చుకు ఒక్క‌టి కూడా క‌న‌ప‌డ‌వు. చిన్న చిన్న మొక్క‌లు, పొద‌లే అక్క‌డ‌క్క‌డా ఉంటాయి. వాటి మ‌ధ్య‌లో ఎన్నో వంద‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌కు ఆన‌వాళ్లుగా నిలిచిన రాతి శిల్పాలు. మౌన ముద్ర‌లో.. మ‌మ్మ‌ల్ని ప‌ల‌క‌రించ‌కండి.. అన్న‌ట్లు చూస్తుంటాయి. ఈ అద్భుత‌మైన చారిత్ర‌క సంప‌ద చూప‌రుల‌ను క‌ట్టి ప‌డేస్తుంటుంది. అందుకే ఆ సంప‌ద‌ను చూసేందుకు వేల సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు ఏటా అక్క‌డికి వెళ్తుంటారు. అదే.. ఈస్ట‌ర్ ఐర్లాండ్‌ దీవి.. ఈ దీవిలో ఉన్న రాతి శిల్పాలు ఇక్క‌డి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.

చిలీ దేశానికి తూర్పు దిశ‌గా సుమారుగా 3600 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌దే ఈస్ట‌ర్ ఐర్లాండ్‌ దీవి. ఈ దీవి ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలో ఉంటుంది. దీని పొడ‌వు 25 కిలోమీట‌ర్లు. వెడ‌ల్పు 12 కిలోమీట‌ర్లు. ఈ దీవిలో పురాత‌న కాలం నుంచి ఉన్న రాతి శిల్పాలు ప‌ర్యాట‌కుల‌ను ముక్కున వేలేసుకునేలా చేస్తుంటాయి. అంత అద్భుతంగా వాటిని చెక్కారు. ఒక్కో శిల్పం సుమారుగా 15 నుంచి 33 అడుగుల ఎత్తు ఉంటుంది. పొడ‌వైన ముక్కు, పెద్ద చెవుల‌తో ఈ శిల్పాలు చూసేందుకు భ‌లే వింతగొల్పుతుంటాయి. ఈ శిల్పాల‌ను నొవాయ్ అని పిలుస్తారు. అయితే ఈ దీవిలో ఇలాంటి శిల్పాలు 887 వ‌ర‌కు ఉన్నాయి.

Easter Ireland Sculptures

నొవాయ్ శిల్పాల‌న్నీ ఏక‌శిలా విగ్ర‌హాలే. ఈ శిల్పాల కింద రాతి గ‌ద్దెలు ఉంటాయి. ఈ గ‌ద్దెల‌ను అహు అని పిలుస్తారు. ఇక ఈ శిల్పాల‌ను 1250 నుంచి 1500 సంవ‌త్స‌రాల కింద‌ట చెక్కిన‌ట్లు చ‌రిత్ర చెబుతోంది. కాగా వీటిని ఈ దీవిలో నివాసం ఉండే రెప‌నూయీ తెగ ప్ర‌జ‌లే చెక్కి ఉంటార‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. అయితే ఈ శిల్పాల‌ను ఎందుకు చెక్కారు ? వాటిని ఎక్క‌డ చెక్కారు ? ఇక్క‌డిదాకా ఎందుకు తీసుకువ‌చ్చారు ? అన్న వివ‌రాలు మాత్రం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే మిగిలిపోయాయి.

కాగా ఈ దీవిలో ఉన్న రానోరారాకుప్ క్వారీలో ఇంకా ఏక‌శిల విగ్ర‌హాలు అలాంటివే కొన్ని ఉన్నాయ‌ట‌. అగ్ని ప‌ర్వ‌తం పేల‌డం వ‌ల్ల బ‌య‌ట‌కు చిమ్మిన లావా నుంచి ఏర్ప‌డ్డ శిల‌ల‌తో ఈ శిల్పాల‌ను చెక్కార‌ట‌. ఆ త‌రువాత ఆ శిల్పాల‌ను ఈ దీవిలోని అన్ని ప్రాంతాల‌కు త‌ర‌లించార‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. ఇక ఈ దీవిలో పెద్ద చెట్లు ఒక్క‌టి కూడా క‌నిపించ‌వు. అది కూడా ఒక వింతే. ఇక ఈ దీవిలో ప్ర‌స్తుతం 6వేల మంది వ‌ర‌కు నివాసం ఉంటున్నారు. వారిలో 60 శాతం మంది రెప‌నూయీ తెగ‌కు చెందిన ప్ర‌జ‌లే కావ‌డం విశేషం. ఇక ఈ దీవిలో ఉన్న శిల్పాల‌ను చూసేందుకు ఇక్క‌డికి ఎంతో మంది ప‌ర్యాట‌కులు కూడా వ‌స్తుంటారు. ఏది ఏమైనా.. ఈ దీవిలోని శిల్పాలు భ‌లే వింత‌గా ఉన్నాయి క‌దా..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వివో నుంచి మరో పవర్ ఫుల్ ఫోన్.. భారత్‌లో Vivo X200T లాంచ్.. ఫీచర్లు, ధర చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…

Tuesday, 27 January 2026, 9:25 PM

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…

Tuesday, 27 January 2026, 7:39 PM

మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!

70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…

Tuesday, 27 January 2026, 5:49 PM

పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…

Tuesday, 27 January 2026, 2:59 PM

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM

మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…

Monday, 26 January 2026, 9:44 PM

అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!

అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…

Monday, 26 January 2026, 7:45 PM

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…

Monday, 26 January 2026, 5:34 PM