Mutton Biryani Recipe In Telugu : మనకు తినేందుకు ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా మటన్ బిర్యానీ భలే టేస్ట్గా ఉంటుంది. అవసరమైన పదార్థాలు వేసి, చక్కగా మటన్ను ఉడికించి, మసాలాలు వేసి బిర్యానీని వండితే.. ఆ తరువాత ఆ బిర్యానీ నుంచి వచ్చే ఘుమాళింపు మామూలుగా ఉండదు. వాసన చూస్తేనే నోరూరిపోతుంది. మరి అలాంటి ఘుమ ఘుమలాడే మటన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
మటన్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – 1/2 కిలో, ఉప్పు – తగినంత, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీస్పూన్, పసుపు – 1/4 టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, ఉల్లిపాయలు – 2, గరం మసాలా – 1 టీస్పూన్, నూనె – 1/2 కప్పు, నిమ్మరసం – 2 టీస్పూన్లు, బాస్మతీ రైస్ – 1/2 కిలో, వెన్న – 2 టీస్పూన్లు, కొత్తిమీర, పుదీనా – 2 కట్టల చొప్పున, పెరుగు – 1/4 కప్పు, యాలకులు – 4, లవంగాలు – 3, దాల్చిన చెక్క – 1 (పెద్దది), బిర్యానీ ఆకులు – 2, బిర్యానీ మసాలా – ఒకటిన్నర టీస్పూన్.
మటన్ బిర్యానీ తయారు చేసే విధానం..
ముందుగా బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత యాలకులు, లవంగాలు, దాల్చిచెక్క, బిర్యానీ ఆకులు, కొద్దిగా వెన్న వేసి ముప్పావు వంతు వరకు బియ్యాన్ని ఉడికించాలి. అనంతరం మటన్ ముక్కలను బాగా కడిగి వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. 20 నిమిషాల పాటు మటన్ ముక్కలను మారినేట్ చేసుకోవాలి.
అనంతరం ఒక పాత్ర తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కాక మటన్ ముక్కలు వేసి కూరలా ఉడికించాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. తరువాత ఒక పాత్ర తీసుకుని అందులో ముందుగా కొంత అన్నం వేయాలి. దానిపై కాస్త మటన్, కొన్ని ఉల్లిపాయ ముక్కలను పేర్చాలి. అలాగే అన్నీ అయిపోయే వరకు ఒకదాని మీద మరొకటి పేరుస్తూ రావాలి. అనంతరం పాత్రపై మూత పెట్టి 20 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. దీంతో ఘుమ ఘుమలాడే మటన్ బిర్యానీ తయారవుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…