Minappappu Masala Vada : మిన‌ప్ప‌ప్పుతో మ‌సాలా వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

January 15, 2026 9:13 PM

Minappappu Masala Vada : మసాలా వ‌డ‌ల‌ను సాధార‌ణంగా చాలా మంది బ‌య‌ట బండ్ల‌పై తింటుంటారు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కాస్త శ్ర‌మిస్తే చాలు వీటిని మ‌నం ఇంట్లోనే ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే వాటి లాంటి రుచి వ‌స్తుంది. ఇక మిన‌ప్ప‌ప్పుతో మ‌సాలా వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. వాటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిన‌ప్ప‌ప్పుతో మ‌సాలా వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొట్టు మిన‌ప్ప‌ప్పు – ఒక క‌ప్పు, ప‌చ్చి మిర్చి – 5, అల్లం – చిన్న ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, మెంతికూర త‌రుగు – పావు కప్పు, కొత్తిమీర త‌రుగు – పావు క‌ప్పు, వాము – 1 టీస్పూన్‌, ప‌సుపు – అర టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, కారం – 1 టీస్పూన్‌, ధ‌నియాల పొడి – 1 టీస్పూన్‌, నూనె – వేయించేందుకు స‌రిప‌డా.

Minappappu Masala Vada recipe how to make this
Minappappu Masala Vada

మిన‌ప్ప‌ప్పు మ‌సాలా వ‌డ‌ల‌ను త‌యారు చేసే విధానం..

మిన‌ప్ప‌ప్పును నాలుగైదు గంల ముందు నాన‌బెట్టుకోవాలి. ఆ త‌రువాత చాలా కొద్దిగా నీళ్లు చ‌ల్లుకుంటూ మెత్త‌గా గారెల పిండిలా రుబ్బుకోవాలి. అదేవిధంగా ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుతోపాటు నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను పిండిలో క‌లిపి త‌రువా వ‌డ‌ల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేస్తూ ఎర్ర‌గా వేయించుకుని తీసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మిన‌ప్ప‌ప్పు మ‌సాలా వ‌డ‌లు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా చ‌ట్నీతో తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now