Ghee : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని ఉపయోగిస్తున్నారు. చిన్నారులకు తల్లులు నెయ్యి కలిపి ఆహారం పెడతారు. నెయ్యి పిల్లలకు మంచి బలం అని వారు అలా పెడతారు. ఇక నెయ్యితో మనం అనేక వంటకాలను కూడా చేస్తుంటాం. అయితే నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని, అది మంచిది కాదని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యి వల్ల మన ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. కానీ దీన్ని అధికంగా తినరాదు. మోతాదులోనే తీసుకోవాలి. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గ్లాస్ పాలలో ఒక టీస్పూన్ నెయ్యి, కొద్దిగా పసుపు, మిరియాలు వేసి తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. నెయ్యి జీవక్రియల రేటు మెరుగు పరిచేలా చేస్తుంది. ఎనర్జీ లెవల్స్ను పెంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
నెయ్యిలో బ్యుట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్ ఫుడ్గా పనిచేస్తుంది. దీంతో పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. నెయ్యిలో విటమిన్ కె2 సమృద్ధిగా లభిస్తుంది. ఎముకలు క్యాల్షియంను గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గేందుకు పనిచేస్తుంది. 5 గ్రాముల నెయ్యిలో 44.8 క్యాలరీలు, 4.9 గ్రాముల కొవ్వు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిస్, ఒబెసిటి, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు డాక్టర్ సలహా మేరకు నెయ్యిని తీసుకోవాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…