Noodles : ప్రస్తుతం నడుస్తున్నది ఫాస్ట్ యుగం. ఈ వేగవంతమైన టెక్నాలజీ జనరేషన్లో ప్రతిది చాలా స్పీడ్గా అయిపోతుంది. ప్రజలు అన్ని పనులు వేగంగా కావాలని చూస్తున్నారు. అన్నింటా వేగం పెరిగింది. టెక్నాలజీ కూడా అంతే వేగంగా మారుతోంది. అందుకనే ఆహారం విషయంలోనూ ప్రజలు వేగాన్ని కోరుకుంటున్నారు. సరిగ్గా 1 గంటపాటు కూర్చుని తినేందుకు కూడా సమయం కేటాయించడం లేదు. దీంతో ఫాస్ట్ఫుడ్కు అలవాటు పడిపోతున్నారు. ఫలితంగా ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఇలా ఆరోగ్యం దెబ్బ తినేందుకు కారణం అవుతున్న వాటిల్లో నూడుల్స్ కూడా ఒకటి.
నూడుల్స్ ను చాలా స్పీడ్గా తయారు చేయవచ్చు. వీటిని బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్లోనూ తినవచ్చు. అందుకనే వాటికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. త్వరగా తయారు చేయవచ్చు, ఫాస్ట్గా తినవచ్చు. అందుకనే చాలా మంది నూడుల్స్ను తింటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రెడీ టు ఈట్ నూడుల్స్ కూడా వచ్చాయి. అందులో కాస్త వేడి నీళ్లు జోడిస్తే చాలు ఆ నూడుల్స్ రెడీ అయిపోతాయి. వాటిని తినవచ్చు. అయితే ఇలాంటి నూడుల్స్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రెడీ టు ఈట్ లేదా ఇతర ఇన్స్టంట్ నూడుల్స్ను తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పేరుకుపోతాయి. దీంతో కిడ్నీలపై భారం పడుతుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీల ఫెయిల్యూర్కు దారి తీయవచ్చు. అలాగే దీని వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడే చాన్స్ కూడా ఉంటుంది. నూడుల్స్లో ఆగ్జలేట్స్ కలుపుతారు. ఇవి మన శరీరంలో క్యాల్షియంతో కలిసి స్టోన్లను ఏర్పడేలా చేస్తాయి. అలాగే నూడుల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కలిపే మోనోసోడియం గ్లూటమేట్ (ఎంఎస్జీ) మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ముఖ్యంగా దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడే చాన్స్ ఉంటుంది. అలాగే హైబీపీ పెరిగి గుండె పోటు కూడా రావచ్చు. కనుక నూడుల్స్ను అతిగా తింటున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…