Chicken Curry : చికెన్ కర్రీ.. మనలో చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువగా వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో చికెన్ కర్రీని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అలాగే దీనిని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా బగారా అన్నంలోకి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మరింత రుచిగా, కమ్మగా తేలికగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి…. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట – 1, జీడిపప్పు – 10, నూనె – 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చికెన్ – అరకిలో, కరివేపాకు – 2 రెమ్మలు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 3 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ముందుగా జార్ లో టమాట, జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత చికెన్, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఈ చికెన్ ను నూనె పైకి తేలే వరకు బాగా వేయించిన తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ ఉడికిన తరువాత గరం మసాలా వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…