Foods : మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. అయితే కొన్ని ఆహారాలను మనం ఉదయం తింటే కొన్నింటిని మధ్యాహ్నం, ఇంకొన్నింటిని రాత్రి పూట తింటుంటాం. కానీ కొన్ని ఆహారాలను అసలు రాత్రిపూట తినకూడదని, తింటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి రాత్రి పూట ఏయే ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా. రాత్రి పూట కొన్ని ఆహారాలను తినడం వల్ల అది మన నిద్రపై ప్రభావం చూపిస్తుంది. దీంతో మొత్తంగా అది మన శరీర ఆరోగ్యంపై ప్రభావం పడేలా చేస్తుంది. అలాగే రాత్రి మనం తినే కొన్ని ఫుడ్స్ వల్ల జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. కనుక కొన్ని రకాల ఫుడ్స్ను మనం రాత్రి పూట తినకూడదు.
కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను రాత్రిపూట అసలు తినకూడదు. ఇవి పొట్టలో అసౌకర్యాన్ని కలగజేస్తాయి. దీంతో గుండెల్లో మంట, అజీర్తి ఏర్పడుతాయి. దీని వల్ల జీర్ణాశయంలో యాసిడ్ల శాతం పెరుగుతుంది. దీంతో కడుపులో మంట కూడా వస్తుంది. ఫలితంగా రాత్రిపూట నిద్ర పట్టదు. అలాగే మరుసటి ఉదయం విరేచనం అయ్యేటప్పుడు మంటగా కూడా ఉంటుంది. కనుక రాత్రి పూట కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను అసలు తినకూడదు.
చాలా మంది రాత్రి పూట స్నాక్స్ అయిన సమోసా, పకోడీలను తింటారు. కొందరు భోజనంలో వీటిని అంచుకు పెట్టి తింటారు. అయితే వీటిల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక రాత్రి సమయంలో వీటిని తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు ఏర్పడుతాయి. అలాగే నిద్ర కూడా పట్టదు. కనుక రాత్రి పూట వీటిని కూడా మానేయాలి. కొందరు రాత్రి సమయంలో కబాబ్స్, బటర్ చికెన్ వంటి మాంసాహారాలను అతిగా తింటుంటారు. అలా తినడం కూడా మంచిది కాదు. వీటిల్లో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. కనుక జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి రాత్రిపూట వీటిని కూడా తినరాదు.
అలాగే రాత్రి పూట స్వీట్లు తినడం వల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువగా చేరుతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. ఇది డయాబెటిస్, గుండె జబ్బులకు దారి తీస్తుంది. కనుక వీటిని కూడా మానేయాలి. అదేవిధంగా టీ, కాఫీ, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలు, నిమ్మ జాతికి చెందిన పండ్లు, కొవ్వు తీయని పాలు లేదా పాల ఉత్పత్తులు, ఐస్ క్రీములు, వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, మద్యం వంటి వాటిని రాత్రిపూట అసలు తీసుకోకూడదు. వీటిని రాత్రిపూట తీసుకుంటే అనారోగ్యాలకు స్వాగతం పలికినట్లు అవుతుంది. కనుక రాత్రిపూట తీసుకునే ఫుడ్ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే కోరి వ్యాధులు తెచ్చుకున్నవారు అవుతారు.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…