Chanakya Niti : ఆచార్య చాణక్యుడు గొప్ప జ్ఞానవంతుడు మరియు పండితుడు. చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని యొక్క గురువు. అతను చాణక్య నీతి అని పిలవబడే నీతి శాస్త్రాన్ని రచించాడు. నేటికి ప్రజలు తమ జీవితాల్లో ఈ విధానాన్ని అవలంబిస్తారు. చాణక్యుడు ఇచ్చిన విధివిధానాలు ఒక మనిషిని వ్యక్తిగతంగా, సామాజికంగా, రాజకీయంగా నడిపిస్తాయి. అలాగే చాణక్యుడు అతని నీతి శాస్త్రంలో మనం ఎల్లప్పుడూ దూరంగా ఉండాల్సిన 5 అలవాట్ల గురించి కూడా చెప్పాడు. వీటికి దూరంగా ఉండకపోతే మనం జీవితంలో వైఫల్యాలను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అతను చెప్పాడు. చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం మనం దూరంగా ఉండాల్సిన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడూ కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు.
దీని వల్ల ప్రజలు వారు చేసే తప్పులను మరిచిపోయి ఇతరుల తప్పులపై దృష్టి ఎక్కువగా పెడతారు. మీ చుట్టూ అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి దూరంగా ఉండడం మంచిది. అలాగే మనం ఎప్పుడూ కూడా శుభ్రమైన వాతావరణంలో ఉండాలి. మన చుట్టూ మురికిగా ఉంటే మన దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అంతేకాకుండా అపరిశుభ్రమైన చోట లక్ష్మీ దేవి ఉండదు. కనుక ఎప్పుడూ స్వచ్చతను, పరిశుభ్రతను పాటించాలి. మన చుట్టూ ఎవరైనా మురికిగా ఉంటే వారికి దూరంగా ఉండడం మంచిది. అలాగే మనం ఎప్పుడూ కూడా నిజాలే మాట్లాడాలి. అబద్దాలు చెప్పకూడదు. అబద్దాలు చెప్పే వారు ఎల్లప్పుడూ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అబద్దాలు చెప్పడం వల్ల మనం గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది.
అలాగే మనం ఎప్పుడూ కూడా చురుకుగా పని చేసుకోవాలి. బద్దకంగా అస్సలు ఉండకూడదు. బద్దకంగా ఉండడం వల్ల మనం భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చాణక్య నీతి ఎప్పుడూ కూడా అత్యాశ మంచిది కాదు అని చెబుతుంది. అత్యాశ, దురాశ రెండు కూడా మంచివి కావు. వీటి వల్ల మనం కష్టాలను, అగౌరవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా చాణక్యనీతి మనకు ఈ 5 చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెబుతుంది. వీటికి దూరంగా ఉండడం వల్ల మనకు మంచి జరగడంతో పాటు గౌరవాన్ని కూడా పొందగలుగుతాము.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…