Naivedyam : హిందూ మతంలో భగవంతుని రోజు వారి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిత్యం పూజలు చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే నియమానుసారంగా పూజలు చేసినప్పుడు మాత్రమే భగవంతుని అనుగ్రహం సానుకూలత లభిస్తాయి. మంత్రోచ్ఛారణ పఠనం మొదలు కొని నైవేద్య సమర్పణ వరకు అన్ని సరిగ్గా చేస్తేనే మనం భగవంతుని కృపను సొంతం చేసుకోగలుగుతాము. అలాగే భగవంతుడికి నైవేద్యాన్ని సరిగ్గా సమర్పిస్తేనే భగవంతుడు సంతోషిస్తాడు. అయితే మనలో చాలా మందికి భగవంతుడికి నైవేద్యం సమర్పించే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. కనుక ఈ రోజు మనం భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.
భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టే సమయంలో నైవేద్య మంత్రం పఠించడం చాలా అవసరం. ఈ మంత్రం పఠించిన తరువాతే భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే బగవంతుడి ముందు నైవేద్యాన్ని ఎత సమయం ఉంచుతున్నామో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. నైవేద్యాన్ని వెంటనే తీసివేయకూడదు. అలాగే ఎక్కువ సమయం పూజ గదిలో ఉంచకూడదు. నైవేద్యాన్ని సమర్పించిన తరువాత 5 నిమిషాల పాటు ఉంచడం మంచిది. 5 నిమిషాల తరువాత నైవేద్యాన్ని తీసుకుని అందరికి ప్రసాతదంగా పంచి పెట్టాలి. అలాగే నైవేద్యాన్ని ఏ పాత్రలో సమర్పిస్తున్నామో చూసుకోవడం కూడా ముఖ్యం. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, మట్టి పాత్రలో మాత్రమే నైవుద్యాన్ని సమర్పించాలి. పాత్ర యొక్క లోహం స్వచ్చంగా ఉండాలి.
అల్యూమినియం, ఇనుము, ఉక్కు, ప్లాస్టిక్, గాజు పాత్రలల్లో నైవేద్యాన్ని సమర్పించడం మంచిది కాదు. అలాగే భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని ఎక్కువ మందికి పంచి పెట్టడం మంచిది. అలాగే నైవేద్యాన్ని తయారు చేసేటప్పుడు శుభ్రంగా, సాత్వికంగా తయారు చేయాలని గుర్తించుకోవాలి. ఇలా తగిన నియమాలు పాటిస్తూ నైవేద్యాన్ని సమర్పించడం వల్ల భగవంతుడు మన కోరికలన్నింటిని తప్పకుండా తీరుస్తాడు. భగవంతుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…