Chaddannam : మనం రోజూ ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, దోశ, వడ, ఇలా అనేక రకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. అయితే పూర్వకాలంలో ఇటువంటి అల్పాహారాలు ఏమి లేని రోజుల్లో మన పెద్దలు చద్దనాన్ని తయారు చేసి తీసుకునే వారు. చద్దనాన్ని తీసుకోవడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఎముకలు ధృడంగా తయారవుతాయి. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేసవికాలంలో మట్టి పాత్రలో తయారు చేసిన చద్దనాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. కనుక కనీసం వారంలో ఒక్కసారైనా చద్దనాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీనిని వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా సులభంగా చద్దనాన్ని తయారు చేసుకోవచ్చు. శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ చద్దనాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చద్దన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
గంజి – ఒక కప్పు, అన్నం – ఒకటిన్నర కప్పులు, వేడి పాలు – ఒకటిన్నర కప్పు, పెరుగు – ఒక టీ స్పూన్. పచ్చిమిర్చి – 2, పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత.
చద్దన్నం తయారీ విధానం..
ముందుగా అన్నం ఉడికేటప్పుడే గంజిని వార్చి పక్కకు ఉంచాలి. అలాగే మనం తినగా మిగిలిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లారిన గంజి వేసి కలపాలి. తరువాత ఇందులో వేడి పాలు పోసి కలపాలి. పాలుగోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. పాలు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో పెరుగు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తరువాత పైన ఉల్లిపాయ ముక్కలు, గాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజూ ఉదయానికి చద్దన్నం తయారవుతుంది. ఇది మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చద్దన్నం తయారవుతుంది. దీనిని ఉల్లిపాయ, పచ్చిమిర్చితో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా చద్దనాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…