Akbar And Birbal : అక్బర్, బీర్బల్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. చిన్న పిల్లలు మొదలు కొని పెద్దల వరకు అందరికీ వీరి గురించి తెలుసు. అక్బర్ పాలనలో బీర్బల్ తన తెలివితో ఎన్నో క్లిష్టతరమైన సమస్యలను పరిష్కరించాడు కూడా. అందుకు అక్బర్ బీర్బల్ను ఎన్నోసార్లు మెచ్చుకోవడం, అందుకు తగిన బహుమతిని అతనికి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ సంఘటన గురించే. మరి అక్బర్ బీర్బల్ను ఏం అడిగాడో, బీర్బల్ అందుకు ఏమని సమాధానమిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందామా.
ఒకానొక రోజు అక్బర్కు చాలా విచిత్రమైన సందేహాలు వచ్చాయి. సందేహాలు అనేకంటే వాటిని ప్రశ్నలు అనడమే ఉత్తమం. ఆ ప్రశ్నలు అక్బర్కు తలెత్తిన వెంటనే వాటిని నివృత్తి చేసుకోవాలని అనిపించింది. వెంటనే బీర్బల్ను పిలిపించాడు. అవే ప్రశ్నలను అతనికి సంధించాడు. అవేమిటంటే..
1. దేవుడు ఎక్కడుంటాడు ?, 2. అతని పని ఏమిటి ?, 3. అతను ఏం తింటాడు ? ఆ ప్రశ్నలను విన్న బీర్బల్కు మొదట ఆశ్చర్యం వేసింది. అయినా చక్రవర్తి అడుగుతున్నాడు కదా. సమాధానం చెప్పాలని ఆయన ముందుకు వెళ్లి ఇలా అన్నాడు. దేవుడు అన్ని చోట్లా ఉంటాడు. అతను ఉండని ప్రదేశం లేదు. భక్తులకు ఆయన తమ తమ హృదయాల్లో దర్శనమిస్తాడు. ప్రేమ, దయ, జాలి ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడే ఉంటాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి వాటిని మనుషుల నుంచి తరిమికొడుతూ వారిని మంచి వారిగా మార్చడమే ఆయన పని. నిత్యం ఆ పనిలోనే ఆయన ఉంటాడు. మనుషుల్లో మార్పు తెస్తుంటాడు. మనుషుల్లో ఉన్న అహంకారాన్ని దేవుడు తినేస్తాడు. అదే ఆయనకు ఆహారం. దాన్ని తిని మనుషులను మంచి వారిగా మారుస్తాడు. ఇలా బీర్బల్ చెప్పిన సమాధానాలకు అక్బర్ సంతృప్తి చెంది అతన్ని బహుమతులతో సత్కరిస్తాడు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…