ఐటీ రంగంలో జాబ్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకు టెక్ మహీంద్రా సదవకాశం కల్పిస్తోంది. ఐటీ, బీపీవో, కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను టెక్ మహీంద్రా కంపెనీ వారు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఫుల్ టైమ్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేస్తారు. డిగ్రీ లేదా పీజీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఫ్రెషర్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఆఫీస్ అయితే నోయిడాలో పనిచేయాల్సి ఉంటుంది.
కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా అభ్యర్థులు రోజుకు 3 షిఫ్టుల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఫ్రెషర్స్కు ఈ నియామక ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుంది. ఐటీ రంగంలో ఎదగాలని చూస్తున్నవారికి ఇదొక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో భాగంగా కస్టమర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. వారి సందేహాలను నివృత్తి చేయాలి. సమస్యలను పరిష్కరించాలి. కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుంది. చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్తోపాటు కంప్యూటర్పై అవగాహన, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ను కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.3 లక్షల ప్రారంభ వేతనం లభిస్తుంది. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పిస్తారు. ట్రావెల్ అలవెన్స్ను కల్పిస్తారు. మరిన్ని వివరాలకు ఎ6, నోయిడా సెక్టార్ 64, నియర్ సహార్ కట్, నియర్ సెక్టార్ 62 మెట్రో స్టేషన్ చిరునామాలో సంప్రదించవచ్చు. లేదా అనుపమ్ (7011087542), దియా (8448603147), సలోని శర్మ (8800817179)లను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే ss00858347@techmahindra.com అనే ఈ-మెయిల్కు మెయిల్ను పంపించవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయాలని ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పైన ఇచ్చిన ఫోన్ నంబర్లను లేదా మెయిల్ ఐడీలో కంపెనీని సంప్రదించవచ్చు. లేదా చిరునామాలో జరిగే వాకిన్ ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…