మీరు టెన్త్ లేదా ఇంటర్ చదివారా..? ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (DGAFMS)లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, ఎల్డీసీ, స్టోర్ కీపర్, ఫైర్మ్యాన్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి నెల మొత్తం గడువు ఇచ్చారు. ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
టెన్త్ లేదా ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. అకౌంటెంట్ పోస్టుకు మాత్రం బీకామ్ చదివి ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 30 ఏళ్ల వరకు ఉండవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
https://dgafms24.onlineapplicationform.org/DGAFMS/ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఈ సైట్లోనే ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. ఇందులో అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఫామ్ నింపాలి. అందులో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు, పని అనుభవం ఉంటే ఆ వివరాలను నమోదు చేయాలి. తరువాత అవసరం అయిన ధ్రువ పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఫోటో, సంతకం, ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. తరువాత అప్లికేషన్ను సబ్ మిట్ చేయవచ్చు.
ఈ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ధ్రువ పత్రాల పరిశీలన ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఫైర్ మన్, ఎంటీఎస్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ ఆధారంగా వేతనాలను చెల్లిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…