SBI Jobs 2023 : ఒక మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్. దేశీయ దిగజా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. మామూలుగా అయితే ఈ గడువు ముగిసిపోయింది. కానీ మరోసారి దరఖాస్తులు గడువుని పొడిగించారు. అక్టోబర్ 3 వరకు అవకాశం వుంది. కాబట్టి, ఇక ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే, దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 2000 పిఓ పోస్టుల భర్తీకి, సెప్టెంబర్ 7న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన సంగతి మనకి తెలుసు. ఇక నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు లోకి వెళితే… మొత్తం ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 2000 ఉన్నాయి. క్యాటగిరీల వారీగా చూస్తే… ఎస్సీ 300, ఎస్టి 150, ఓబిసి 540, ఈడబ్ల్యూఎస్ 200, యుఆర్ 810. ఇక శాలరీ విషయానికి వస్తే.. ఎంపికైన వాళ్ళకి బేసిక్ పే 41,960 గా ఉంది. అలానే, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.
ఇక వయసు విషయానికి వస్తే… ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళ వయసు, ఏప్రిల్ ఒకటి 2023 నాటికి 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. 30 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబిసి మూడేళ్లు, దివ్యాంగులకి 10 నుండి 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ తదితరులకి ఐదేళ్ల చొప్పున వయోసడలింపు ఉంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్ససైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు. నవంబర్లో ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. డిసెంబర్ లేదా జనవరిలో ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో సైకోమెట్రిక్, ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్ససైజ్ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి లేదా మార్చి లో ఫలితాలు రిలీజ్ చేస్తారు.
ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా…
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో…
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం…
సూపర్స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత…
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ…
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి,…
గొప్పలకు పోయి అప్పులు చేసి యువత కష్టాల పాలు కావొద్దని, విలాసాలకు దూరంగా ఉండాలని నటుడు మంచు మనోజ్ సూచించారు.…
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి…