ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. CISFలో ఖాళీగా ఉన్న మొత్తం 1124 కానిస్టేబుల్ పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను జనరల్ విభాగంలో 460 ఖాళీలు ఉండగా, ఎస్సీ 167, ఎస్టీ 83, ఓబీసీ 303, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 111 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను లెవల్ 3 పోస్టులుగా పరిగణిస్తున్నారు. వీటికి గాను రాత పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు 100 మార్కులతో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షను 120 నిమిషాల్లో పూర్తి చేయాలి.
మొత్తం పోస్టుల్లో 845 పోస్టులు కానిస్టేబుల్, డ్రైవర్ పోస్టులు కాగా 279 పోస్టులు డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ విభాగంలో ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్థులు 10వ తరగతి లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. డ్రైవింగ్ వచ్చి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు సడలింపులు ఇచ్చారు.
అభ్యర్థులకు వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ అండ్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మార్చి 4ను చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు, ఆన్లైన్లో అప్లై చేసేందుకు https://cisfrectt.cisf.gov.in/index.php అనే అధికారిక వెబ్సైట్ను అభ్యర్థులు సందర్శించవచ్చు.
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…