ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న IOCL శాఖలలో పనిచేసేందుకు గాను పలు విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 246 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ ఆపరేటర్, జూనియన్ అటెండెంట్, జూనియన్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ లేదా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొదలు కాగా ఫిబ్రవరి 23ను చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెలలో ఫలితాలను ప్రకటిస్తారు.
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గాను ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. జూనియర్ ఆపరేటర్ పోస్టులకు టెన్త్ లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి. జూనియర్ అటెండెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలి. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. రూ.300 అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. రిజర్వ్డ్ విభాగాలకు చెందిన వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థులకు నెలకు రూ.23వేల నుంచి రూ.1.05 లక్షల వరకు వేతనం ఇస్తారు. ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. మరిన్ని వివరాలకు గాను https://iocl.com/latest-job-opening అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. అక్కడే ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…