బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును కమిషన్ పొడిగించింది. అభ్యర్థులు ఇప్పుడు 2026 జనవరి 29 రాత్రి 11:59 గంటల వరకు రిజిస్ట్రేషన్తో పాటు ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇంటర్ లెవల్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన అతిపెద్ద నియామకాల్లో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. మొత్తం 24,492 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 2025 అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియకు పెద్ద ఎత్తున స్పందన లభించడంతో, మరింత మందికి అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించినట్లు BSSC వెల్లడించింది.
ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను BSSC 2025 సెప్టెంబర్ 27న విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 15, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. తాజా నిర్ణయంతో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చివరి తేదీని జనవరి 29, 2026 వరకు పొడిగించారు. పూర్తిగా దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయడానికి గడువు జనవరి 31, 2026 వరకు ఉంటుందని కమిషన్ తెలిపింది. పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. పరీక్షకు ముందు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు.
ఈ నియామకాల్లో అభ్యర్థులను ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష, అనంతరం మెయిన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అవసరమైతే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. చివరిదశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గడువు ముగిసేలోపు ప్రక్రియను పూర్తిచేసుకోవాలని, చివరి తేదీల కోసం వేచి చూడకుండా ముందుగానే అప్లై చేసుకోవాలని BSSC సూచించింది.
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…