ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి, విక్రమ్ అని ఇద్దరూ ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ కూడా పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. రవి బాగా డబ్బు భూమి ఉన్న వ్యక్తి. విక్రమ్ మాత్రం చాలా పేద రైతు. ఎన్నో కష్టాలను ఎదుర్కొనేవాడు. ఏది ఏమైనా ఎవరి కుటుంబానికి వాళ్ళు ప్రేమనురాగాలని పంచేవారు ఒక రోజు ఆ గ్రామం లో తీవ్రమైన కరువు ఏర్పడింది. పంటలు, భూమి ఎండిపోయాయి బంజరు భూమిగా మారిపోయింది. అయితే రవి తన సంపద తనని కాపాడుతుందని అప్పటివరకు ఎదురుచూడాలని అనుకున్నాడు.
విక్రమ్ అదృష్టం మీద ఆధారపడలేదు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడు విక్రమ్ ఇరుగుపొరుగు గ్రామాలలో ఉండే రైతులు దగ్గరికి వెళ్లి ఎలా పంటలు పండించాలి అనేది నేర్చుకున్నాడు. విక్రమ్ ఎలా అయినా కష్టాల నుండి గట్టెక్కాలని అనుకున్నాడు. అందుకు కొన్ని రకాల పద్ధతుల్ని నేర్చుకున్నాడు నీటి సంరక్షణ పద్ధతుల్ని కరువు నిరోధక పంటలు సమర్థవంతమైన నీటిపారుతుల వ్యవస్థలు ఇటువంటివన్నీ తెలుసుకుని తన కుటుంబాన్ని పోషించే మార్గాన్ని వెతుక్కున్నాడు.
ఎంతో కష్టపడి తను నేర్చుకున్న టెక్నిక్స్ తో పాటుగా కష్టాన్ని నమ్ముకుని కష్టాల్లో ఉన్న తోటి రైతులతో పాటుగా పంటలు పండించడం మొదలుపెట్టాడు. కొన్ని నెలలు గడిచాయి. కొన్నాళ్ళకి వర్షాలు పడ్డాయి. విక్రమ్ పంటలు బాగా పండాయి. రవి భూమి మాత్రం అలానే ఉండిపోయింది విక్రమ్ సక్సెస్ చూసిన రవి అతని దగ్గరికి వెళ్ళాడు. సంపద ఉంటే సరిపోదు అని తెలుసుకున్నాడు. విక్రమ్ ని ప్రశంసించాడు.
రవి విక్రమ్ స్ఫూర్తితో తన వనరులని మంచి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. నీటి సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించాడు. గ్రామంలో వ్యవసాయం కోసం డబ్బులు ని ఖర్చు చేశాడు. ఇలా అగ్రికల్చర్ హబ్ని ఏర్పాటు చేశారు. డబ్బులు ఉంటే సక్సెస్ రాదని ఆనందం ఉండదని ఈ కథను చూస్తే అర్థమవుతుంది. నేర్చుకోవాలని సంకల్పం ప్రతి మనిషికి ఉండాలని ఇది తెలియజేస్తోంది. కష్టాల నుండి గట్టెక్కాలంటే ఆర్థిక స్థితితో సంబంధం లేదని కూడా ఈ కథ మనకి తెలియజేస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…