Throat Pain : ప్రస్తుత తరుణంలో చాలా మందిని గొంతు సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సీజన్ మారినప్పుడు.. వాతావరణం తేడాగా ఉన్నప్పుడు సహజంగానే ఎవరికైనా సరే జలుబు చేస్తుంది. దీంతోపాటు గొంతు సమస్యలు కూడా వస్తాయి. గొంతులో మంట, నొప్పి, దురదగా ఉండడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఎవరైనా సరే కింద చెప్పిన చిట్కాలను పాటిస్తే.. దాంతో గొంతు నొప్పి.. ఇతర గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ మిరియాల పొడి వేసి మరిగించాలి. కషాయంలా మారిన తరువాత అందులో కాస్త బెల్లం వేయాలి. బెల్లం కరిగాక గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం పోతుంది. దగ్గు తగ్గుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
రెండు కప్పుల నీళ్లలో ఒక టీస్పూన్ వాము వేసి మరిగించాలి. నీరు ఒక కప్పు అయ్యే వరకు మరిగించాక అనంతరం మిశ్రమాన్ని వడకట్టాలి. అందులో కాస్త నిమ్మరసం, తేనె కలపాలి. ఇలా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. దీని వల్ల గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి.
గొంతు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఒక టీస్పూన్ తులసి రసం, రెండు టీస్పూన్ల తేనె కలిపి మిశ్రమంగా చేసి రోజుకు 4 సార్లు తీసుకోవాలి. దీంతో నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజూ ఉదయం, రాత్రి భోజనానికి 30 నిమిషాల ముందు 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ రసాన్ని సేవించాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా గొంతు నొప్పి నుంచి బయట పడవచ్చు. ఇలా పలు చిట్కాలను పాటిస్తే గొంతు నొప్పి సత్వరమే తగ్గిపోతుంది. శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…