Tamarind Seeds : చింత గింజలను సహజంగానే చాలా మంది పడేస్తుంటారు. చింతపండును ఉపయోగించాక అందులో ఉన్న గింజలను పడేస్తుంటారు. అయితే వాస్తవానికి చింత గింజలతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చింతగింజలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. వీటితో అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. చింతగింజలతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతగింజల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గింజల్లో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ గింజల్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు సైతం అధికంగానే ఉంటాయి. అందువల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో ఆయా నొప్పులను తగ్గించుకోవచ్చు.
ఈ గింజలు చర్మాన్ని సైతం సంరక్షిస్తాయి. వీటిల్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటి పొడిని వాడితే చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. మృదువుగా ఉంటుంది. దీంతో యవ్వనంగా ఉంటారు. చర్మం తన సాగే గుణాన్ని కోల్పోదు, దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. ముఖంపై ముడతలు కనిపించవు. ఈ గింజలు జీర్ణ సమస్యలకు సైతం చక్కగా పనిచేస్తాయి. వీటితో జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే మలబద్దకం ఉండదు. గ్యాస్ తగ్గుతుంది.
ఈ గింజలను వాడడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. అందువల్ల వీటిని తీసుకుంటే షుగర్ లెవల్స్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఫలితంగా కిడ్నీలు, కళ్లు, లివర్ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి సమస్యలు రావు. ఇలా చింత గింజలతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వీటిని వాడుకోవాలి. దీంతో అనుకున్న ఫలితాలు వస్తాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…