Rice Powder For Face : బియ్యప్పిండిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేసి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. బియ్యం పిండి వంటలకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఫేమస్ ఏషియన్ బ్యూటీ సీక్రెట్ అని కూడా అంటారు. బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. కళ్ళ కింది నల్లని చారలు, నల్లని వలయాలు వయస్సైన వారి లక్షణాలను సూచిస్తాయి. బియ్యం పిండిలో ఆముదం నూనెను మిక్స్ చేసి, కళ్ళ కింద ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే వృద్ధాప్య లక్షణాలను కనబడనివ్వకుండా డార్క్ సర్కిల్స్ ను మాయం చేస్తుంది.
బియ్యం పిండిలో కొద్దిగా కీరదోసకాయ జ్యూస్ మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మాన్ని టైట్ గా మార్చి చర్మంపై వయస్సైన లక్షణాలను కనబడనివ్వదు. ఇది టాన్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. బియ్యం పిండిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ నేచురల్ రెమెడీ సూర్యరశ్మి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అందుకోసం కొద్దిగా బియ్యం పిండి తీసుకుని అందులో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది.
బియ్యం పిండిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం, మెడ మొత్తానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత కడిగేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయంటే చర్మం చూడడానికి చాలా డల్ గా కనబడుతుంది. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా నివారించడంలో బియ్యం పిండి హెల్ప్ చేస్తుంది. బియ్యం పిండిలో తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి కొత్త చర్మ కణాలు ఏర్పడుతాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.
బియ్యం పిండిని జల్లించి అందులో మొక్కజొన్న పొడిని మిక్స్ చేసి మీరే స్వయంగా పౌడర్ ను తయారుచేసుకోవచ్చు. ఈ పౌడర్ వల్ల చర్మంపై ఎక్కువ జిడ్డు కనబడదు. ఎక్కువ సమయం పాటు నేచురల్ స్కిన్ ను కలిగి ఉంటారు. ఇది చర్మానికి మెరుపును అందాన్ని ఇస్తుంది. ఇలా బియ్యం పిండిని వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. అందంగా, కాంతివంతంగా కనిపిస్తారు. రంగు మారుతుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. యవ్వనంలో ఉన్నట్లు ఉంటారు. కనుక బియ్యం పిండిని ఒకసారి ట్రై చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…