మూత్రం.. మన శరీరంలోని రక్తంలో ఉండే పలు వ్యర్థ పదార్థాల మిశ్రమం. దాన్నంతటినీ మూత్రం రూపంలో కిడ్నీలు వడబోస్తాయి. అలా విడుదలైన మూత్రం మూత్రాశయంలోకి చేరుతుంది. అక్కడ మూత్రం నిండుతుందనగానే మెదడు మూత్రానికి వెళ్లాలని సిగ్నల్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో మనం మూత్రానికి వెళ్తాం. అయితే మూత్ర విసర్జన విషయానికి వస్తే పురుషులు, స్త్రీలు భిన్న రకాలుగా చేస్తారు. స్త్రీలు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే పురుషులు నిలబడి చేస్తారు. కొందరు పురుషులు కూడా కూర్చునే మూత్ర విసర్జన చేస్తారు. అది వేరే విషయం. కానీ మీకు తెలుసా..? పురుషులు నిలబడి కాక, కూర్చుని మూత్ర విసర్జన చేస్తే దాంతో ఎంతో ఉపయోగం ఉంటుందట. అవును, మీరు విన్నది నిజమే.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు మంది కూర్చునే మూత్ర విసర్జన చేస్తారట. ఈ క్రమంలో అలా మూత్ర విసర్జన చేసే వారిలో చాలా మంది ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారట. అనేక మందికి మూత్రాశయ సంబంధ సమస్యలు లేవట. అంతెందుకు, ఒకప్పుడు మన తాతలు, ముత్తాతలు చాలా వరకు కూర్చునే మూత్ర విసర్జన చేసే వారు గమనించారా..? ఆ.. అవును, కానీ ఇప్పుడు అధిక శాతం మంది నిలబడే మూత్ర విసర్జన చేస్తున్నారు. అయితే ఇలా కంటే కూర్చుని మూత్ర విసర్జన చేస్తేనే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. అవేమిటంటే..
సాధారణంగా మూత్రంలో ఉండేవన్నీ వ్యర్థ పదార్థాలే. ఈ క్రమంలో వ్యాధిగ్రస్తుల నుంచి వచ్చే మూత్రంలో ఒక్కోసారి బాక్టీరియా కూడా ఉంటుంది. దీంతో వారు నిలుచుని మూత్ర విసర్జన చేస్తే దాంతో ఆ బాక్టీరియా అంతా బాగా వెదజల్లినట్టు అవుతుంది. అలా వెదజల్లినట్టు పడే బాక్టీరియా ఇతరుల శరీరాల్లోకి సులభంగా ప్రవేశిస్తుందట. అందుకే కూర్చుని మూత్ర విసర్జన చేస్తే బాక్టీరియా అంతా ఒకే దగ్గర ఉండి అంతటా విస్తరించదు. కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరానికి ఎంతో శుభ్రతను అందించినట్టు అవుతుందట.
మూత్రాశయ, శృంగార సంబంధ సమస్యలు ఉన్నవారు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే దాంతో ఆయా సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందట. కూర్చుని మూత్ర విసర్జన చేస్తే మూత్రాశయం నుంచి మూత్రం పూర్తిగా బయటకు వస్తుందట. ఇది కిడ్నీ స్టోన్స్, మూత్రాశయ సమస్యలు ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుందట. కనుక పురుషులు ఎవరైనా సరే నిలుచునే కంటే కూర్చుని మూత్ర విసర్జన చేస్తేనే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…