Touching Elders Feet : మన కన్నా పెద్ద వారి కాళ్లకు వంగి దండం పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది భారతీయ సాంప్రదాయంలోనే ఉంది. మన దేశంలో అనేక వర్గాలకు చెందిన వారు ఈ ఆచారాన్ని పాటిస్తారు. దీంతో పెద్దల ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని దాంతో పిల్లలకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఆ కోవలోనే ఎవరైనా తమ కన్నా వయస్సులో పెద్ద అయిన వారి కాళ్లకు నమస్కరిస్తారు. అయితే నిజానికి ఇందులో మనకు తెలియని పలు విషయాలు దాగి ఉన్నాయి. శాస్త్రం పరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఇలా చేయడం మనకు మంచిదే. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేహంలో పాదాలు అనేవి మన శరీరం మొత్తం బరువును మోస్తాయి. అవి మన దేహానికి ఆధారం వంటివి. అవి లేకుండా మనం నిలుచులేం. సృష్టిలో కేవలం కొన్ని పక్షులు, జంతువులకు తప్ప ఇలా పాదాలపై అదే పనిగా నిలబడగలిగే సామర్థ్యం ఏ జీవికీ లేదు. అందుకే అలాంటి పాదాలకు నమస్కరించాలని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే మనం పెద్దవాళ్ల పాదాలకు నమస్కరిస్తాం.
పెద్దవాళ్లంటే.. వారికి జీవితంపై ఎంతో అనుభవం ఉంటుంది. పిల్లల కన్నా ఎంతో జ్ఞానాన్ని వారు కలిగి ఉంటారు. వారికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. అలాంటప్పుడు వారి పాదాలకు నమస్కరిస్తే వారి జ్ఞానం, తెలివి తేటలు, జీవిత అనుభవం అన్నీ పిల్లలకు వస్తాయని, వారు జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతారని విశ్వసిస్తారు. కనుకనే పెద్దల పాదాలకు పిల్లలు నమస్కరిస్తారు.
పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందితే వారి విజ్ఞానం పిల్లలకు అందుతుందని అధర్వణ వేదం చెబుతోంది. పెద్దల పాదాలకు నమస్కరించినప్పుడు వారిలో ఉండే పాజిటివ్ శక్తి పిల్లలకు చేరుతుందట. అలాగే పిల్లల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ పెద్దలకు ప్రసారమవుతుందట. దీంతో ఇద్దరికీ ఉండే ఆరోగ్య సమస్యలు పోతాయట. సైన్స్ ప్రకారం అలా వంగి పాదాలకు నమస్కరిస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుందట. దీంతో గుండె సమస్యలు రావట.
ఇవీ.. పెద్దల పాదాలకు నమస్కారం చేయడానికి, వారి ఆశీస్సులు తీసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు. అయితే పాదాలకు నమస్కరించినప్పుడు కుడి చేతితో కుడి పాదాన్ని, ఎడమ చేతితో ఎడమ పాదాన్ని తాకి నమస్కారం తీసుకోవాలట. అలా నమస్కారం చేయడమే సరైందని పురాణాలు చెబుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…