Phone Beside Bed : స్మార్ట్ఫోన్.. ఇప్పుడిది అందరికీ మద్యపానం, ధూమపానంలా ఓ వ్యసనంగా మారింది. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి పడుకునే వరకు, ఇంకా చెబితే బెడ్ పక్కనే ఎప్పటికీ అందుబాటులో స్మార్ట్ఫోన్ను ఉంచి పడుకోవడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల శరీరం అనారోగ్యాలకు గురవుతుందని ఇంతకు ముందు నుంచే వైద్యులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే కొందరు సైంటిస్టులు చేసిన తాజా పరిశోధనల్లో తెలిసింది ఏమిటంటే.. రాత్రి పూట ఫోన్ను వాడడం, లేదా పక్కనే పెట్టుకుని నిద్రించడం వంటి పనులు చేస్తే అలాంటి వారికి సంతానం కలిగేందుకు చాలా తక్కువగా అవకాశం ఉంటుందని తెలిసింది. అవును, మీరు విన్నది నిజమే.
కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఒకాసా యూనివర్సిటీ, జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజన్సీ వంటి యూనివర్సిటీలు, సంస్థలు రాత్రి పూట సెల్ఫోన్ వాడకం, దాని వల్ల కలిగే ప్రభావాలపై ఇటీవల పరిశోధనలు చేశాయి. ఇందులో భాగంగా వారు కొన్ని ఎలుకలను తమ పరిశోధనకు ఎంచుకున్నారు. వాటిలో కొన్నింటిని అలాగే వదిలేయగా, మరికొన్నింటిపై సెల్ఫోన్ డిస్ప్లే నుంచి వచ్చే కాంతిని ప్రసారం చేశారు. ఈ క్రమంలో చివరకు తెలిసిందేమిటంటే సాధారణ ఎలుకలు రుతుక్రమం వచ్చే సరికి 71 శాతం సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయని, అదే కాంతి ప్రసారం చేయబడ్డ ఎలుకల సంతానోత్పత్తి 10 శాతానికి పడిపోయిందని గుర్తించారు. అంటే సెల్ఫోన్ డిస్ప్లే నుంచి వచ్చే కాంతి వల్ల ఎలుకల్లో సంతానోత్పత్తి అవకాశం 60 శాతానికి పైగా పడిపోయిందని తేల్చారు. అయితే ప్రయోగాలు ఎలుకలపై చేసినా, మనుషులకు కూడా ఇది వర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
రాత్రి పూట సెల్ఫోన్ వాడకం వల్ల, ఫోన్ను పక్కనే పెట్టుకుని నిద్రించడం వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం పడడమే కాదు, ఇంకా ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట. మన శరీరంలో జరిగే జీవక్రియలకు ఆటంకం కలుగుతుందట. హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయట. నిద్ర సరిగ్గా పట్టదట. శరీరానికి ముఖ్యంగా కావల్సిన మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుందట. నీరసం, గుండె పోటు, గుండె సంబంధ వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందట. అంతే కాదు చర్మం త్వరగా ప్రభావితమై వృద్ధాప్య సంకేతాలు కనబడతాయట. కనుక, సెల్ఫోన్ను రాత్రి పూట వాడడం మానేయండి. అంతేకాదు, దాన్ని పక్కన పెట్టుకుని కూడా నిద్రించకండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…