Barley Water : బార్లీ గింజలను ఎక్కువగా బీర్ తయారీలో ఉపయోగిస్తారు. అంతమాత్రం చేత వాటితో తయారు చేసిన నీటిని తాగితే మత్తు వస్తుందనుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి. వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి. అనంతరం ఆ నీటిని చల్లార్చి వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీస్పూన్ తేనెను కలుపుకుని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో అనేక అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు.
పైన చెప్పిన బార్లీ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం రూపంలో బయటికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రం అవుతుంది. ఇది కోలన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. బాగా వేడి చేసిన వారు బార్లీ నీటిని తాగడం వల్ల దాన్నుంచి ఉపశమనం పొందుతారు. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. బార్లీ నీటిలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్లు, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. మధుమేహం ఉన్న వారు బార్లీ నీటిని తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే బార్లీలో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.
బార్లీలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ అదుపులో ఉంటుంది. గర్భంతో ఉన్న స్త్రీలు బార్లీ వాటర్ తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఇతరులకు కూడా మూత్రాశయ సమస్యలు ఉంటే బార్లీ నీటిని నిత్యం తాగవచ్చు. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బార్లీ నీటికి ఉంది. రోజూ బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. బాలింతలు బార్లీ వాటర్ తాగితే పాలు బాగా పడతాయి. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే పోషకాలు శరీర మెటబాలిజంను క్రమబద్దీకరిస్తాయి. దీంతో బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గాలనుకుంటే బార్లీ వాటర్ను ఉదయంతోపాటు సాయంత్రం కూడా తాగాల్సి ఉంటుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…