Over Weight : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గర కొవ్వుతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం. ఈ డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి పావు స్పూన్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేయాలి. ఒక నిమిషం మరిగాక చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న అల్లం ముక్క వేయాలి. ఆ తర్వాత పావు టీస్పూన్ పసుపు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగాక దించి వడకట్టాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక కప్పు తాగాలి.
ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ డ్రింక్ తాగాక 40 నిమిషాల వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు. బరువు బాగా ఎక్కువ ఉన్నవారు రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఈ డ్రింక్ తాగాలి. ఈ డ్రింక్ ని ఐదు రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మరో ఐదు రోజులు తాగాలి. ఈ విధంగా డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగిపోతుంది. మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, పసుపులో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. కేలరీలు కూడా వేగంగా ఖర్చవుతాయి. దాంతో కొవ్వు కరుగుతుంది.
అధిక బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వేడి శరీరం ఉన్నవారు రోజుకి ఒకసారి మాత్రమే తాగాలి. ఎందుకంటే పైన చెప్పిన పదార్థాలన్నీ వేడి చేసే పదార్ధాలు. వేడి శరీరం ఉన్నవారు ఈ డ్రింక్ తాగినప్పుడు ఏమైనా అసౌకర్యం ఉంటే డ్రింక్ తాగడం మానేయాలి.. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…