Meals : అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. నిజానికి బరువు ఎక్కువగా ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. అందుకని వీలైనంత వరకు బరువును తగ్గించుకోవడం మంచిది. బరువు తక్కువ వున్నా ఎక్కువ వున్నా ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు రాత్రిపూట భోజనం మానేస్తూ ఉంటారు. రాత్రి భోజనం మానేసి కొవ్వుని తగ్గించుకోవడానికి చూస్తూ ఉంటారు. అయితే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఎంత ముఖ్యమో.. రాత్రి భోజనం కూడా అంతే ముఖ్యం.
రాత్రి తినే ఆహారంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. రాత్రి భోజనం చేయడం వలన బరువు తగ్గడానికి సరైన ఆహార పదార్థాలను ఎంచుకోవడం మంచిది. అయితే రాత్రిళ్ళు బాగా హెవీగా తీసుకున్నట్లయితే, కచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. నిద్ర కూడా పట్టదు. గ్యాస్టిక్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే.. రాత్రిపూట ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే కచ్చితంగా కొవ్వు తగ్గిపోతుంది అని. కానీ అలా ఎప్పుడూ చేయకండి.
ఎందుకంటే రాత్రి భోజనం చేయకపోవడం వలన అలసట, బలహీనంగా అయిపోవడం వంటివి కలుగుతుంటాయి. ఖాళీ కడుపుతో నిద్రపోవడం మంచిది కాదు. లైట్ గా డిన్నర్ ని తీసుకోండి. రాత్రిపూట కనుక మీరు తినడం మానేస్తే మళ్ళీ ఉదయం వరకు ఏ ఆహారాన్ని కూడా తీసుకోకపోవడంతో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, వికారంగా ఉండడం, జీవక్రియలోపాలు, అజీర్తి లాంటివి కలుగుతూ ఉంటాయి.
బరువు తగ్గడానికి ముందు ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటిని తీసుకోవద్దు. రాత్రి 8 గంటల లోపు భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రాత్రి కూడా లైట్ గా ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గవచ్చు. రోజూ నాలుగైదు సార్లు ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. భోజనం మధ్యలో విరామం ఇవ్వండి. కనీసం నాలుగు గంటలలోగా ఆహారాన్ని తీసుకోండి. ఇలా మీరు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే లేనిపోని ఇబ్బందులు వస్తుంటాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…