ప్రతి తల్లి, తండ్రి కూడా వాళ్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని.. ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం బాగుండాలి. మంచి ఆహారం, పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు కచ్చితంగా బాధ్యత వహించాలి. మంచి ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వాలి.
సరైన ఆహారం పిల్లలు తీసుకోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. పైగా ఎదిగే పిల్లలకి బలం చాలా ముఖ్యం. అందుకనే ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి అసలు పెట్టకండి. వీటి వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా బలం ఏమీ రాదు.
పిల్లలకి మొలకలు, నానబెట్టిన పల్లీలు వంటివి వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇవ్వండి. పచ్చి కొబ్బరిని రోజు విడిచి రోజు అయినా పిల్లలకి తినిపించాలి. పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటివి పిల్లలకి పెడుతూ ఉండండి. నువ్వులను బెల్లంతో కలిపి ఉండలు చేసి రోజు ఒకటి ఇవ్వండి. అప్పుడు ఎముకలు దృఢంగా ఉంటాయి. మునగాకు జ్యూస్ చేసి పిల్లలకి పాలతో పాటుగా ఇవ్వండి.
పిల్లలకి పంచదారని అస్సలు పెట్టొద్దు. పంచదారకి బదులుగా తాటి బెల్లం పెట్టొచ్చు. పిల్లలకి క్యాల్షియం అందడానికి రాగులని ఇవ్వండి. రాగులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాసు రాగి జావ పెట్టండి. డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి కూడా పిల్లలు రోజూ తినేటట్టు చూడండి. వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలని కూడా పెట్టండి. వీటిని కనుక మీరు రెగ్యులర్ గా పాటించారంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇటువంటివి మీరు వారి డైట్ లో ఇచ్చారంటే, ఇక వారి ఆరోగ్యం గురించి మీరు ఆలోచించక్కర్లేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…