ప్రతి తల్లి, తండ్రి కూడా వాళ్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని.. ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం బాగుండాలి. మంచి ఆహారం, పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు కచ్చితంగా బాధ్యత వహించాలి. మంచి ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వాలి.
సరైన ఆహారం పిల్లలు తీసుకోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. పైగా ఎదిగే పిల్లలకి బలం చాలా ముఖ్యం. అందుకనే ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి అసలు పెట్టకండి. వీటి వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా బలం ఏమీ రాదు.
పిల్లలకి మొలకలు, నానబెట్టిన పల్లీలు వంటివి వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇవ్వండి. పచ్చి కొబ్బరిని రోజు విడిచి రోజు అయినా పిల్లలకి తినిపించాలి. పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటివి పిల్లలకి పెడుతూ ఉండండి. నువ్వులను బెల్లంతో కలిపి ఉండలు చేసి రోజు ఒకటి ఇవ్వండి. అప్పుడు ఎముకలు దృఢంగా ఉంటాయి. మునగాకు జ్యూస్ చేసి పిల్లలకి పాలతో పాటుగా ఇవ్వండి.
పిల్లలకి పంచదారని అస్సలు పెట్టొద్దు. పంచదారకి బదులుగా తాటి బెల్లం పెట్టొచ్చు. పిల్లలకి క్యాల్షియం అందడానికి రాగులని ఇవ్వండి. రాగులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాసు రాగి జావ పెట్టండి. డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి కూడా పిల్లలు రోజూ తినేటట్టు చూడండి. వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలని కూడా పెట్టండి. వీటిని కనుక మీరు రెగ్యులర్ గా పాటించారంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇటువంటివి మీరు వారి డైట్ లో ఇచ్చారంటే, ఇక వారి ఆరోగ్యం గురించి మీరు ఆలోచించక్కర్లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…