Mistakes : మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఆకలిని ఆపితే ఎసిడిటీతో మొదలై ఎన్నో ఇబ్బందులు వస్తాయి. పేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే, మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా అంటూ ఉంటారు. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఉపవాసం సమయంలో నీరు తాగాలి. లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి కడుపులో మంట కలుగుతుంది. షుగర్ తో బాధపడే వాళ్ళు ఉపవాసం చేయకపోవడమే మంచిది.
అలానే ఎక్కువ సేపు కష్టపడి పని చేసే వాళ్ళు కూడా ఉపవాసం చేయకపోవడమే మంచిది. బలహీనంగా ఉండే వాళ్ళు కూడా ఉపవాసం చేయకూడదు. మందులు వేసుకునే వాళ్లు కూడా ఉపవాసం చేయకుండా ఉండడమే మంచిది. ఆవలింతని కూడా ఆపకూడదు. రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆవలింతలు వస్తాయి. తుమ్ము వచ్చినప్పుడు కూడా అసలు ఆపకూడదు. బలవంతంగా తెచ్చుకుని తుమ్మ కూడదు కూడా.
చాలామంది మూత్రం వస్తే కూడా మూత్రానికి వెళ్లకుండా ఆపేస్తూ ఉంటారు. కొంతమంది అయితే దాహం వేసినా మూత్రం వస్తుందేమో అని నీళ్లు తాగడం మానేస్తారు. ఈ రెండు పొరపాట్లు కూడా అస్సలు చేయకూడదు. అదేవిధంగా నవ్వు కూడా చాలా ముఖ్యమైనది. నవ్వినప్పుడు శరీరంలో కొన్ని రసాలు విడుదలవుతాయి. మెదడులో ప్లీనరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. అది రసాలు విడుదల చేసినప్పుడు మనకి నవ్వు వస్తుంది. దీనిని రిలీజ్ చేయడం కొన్ని సెకండ్లలోనే భావం కలగడం నవ్వు రావడం అన్నీ ఒకేసారి జరిగిపోతుంటాయి. కాబట్టి నవ్వుని కూడా ఆపడం మంచిది కాదు.
దాహాన్ని కూడా ఆపకూడదు. దాహం వేసినప్పుడు కచ్చితంగా నీళ్లు తాగాలి. ఉదయాన్నే రెండున్నర లీటర్ల వరకు నీళ్లు దాహం వేయకపోయినా తాగాలి. అప్పుడు మలినాలు పోతాయి. నీళ్లు తాగేటప్పుడు సుఖాసనంలో కూర్చుని నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది. మలవిసర్జనని కూడా ఆపకూడదు. ఉదయాన్నే రెండుసార్లు మలవిసర్జన చేయాలి. వీటిలో వేటిని కూడా బలవంతంగా ఆపకూడదు. ఆపితే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…