Non Veg : ఈ రోజుల్లో చాలా మంది మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదని శాకాహారులు కింద మారిపోతున్నారు. మాంసాహారం తినే వాళ్లు కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు ఇలాంటి పొరపాట్లను చేస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడుతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. చాలామంది మాంసాహారాన్ని, కోడిగుడ్లు తినడం వలన దృఢంగా ఉంటారని అంటుంటారు. కానీ అది నిజం కాదు.
మనిషి పేగులు ఆరు మీటర్లు పొడవు ఉంటాయి. 20 అడుగులు ఉంటాయి. అందుకనే విసర్జనకి ఎక్కువ సమయం పడుతుంది. పైగా మానవ శరీరం మాంసాహారం తీసుకోవడానికి అనువుగా ఉండదు. అలానే మాంసాహారం, గుడ్లు, పాలు కలిపి తీసుకోకూడదు. మాంసాహారం తిన్న మనిషికి క్రూరత్వం పెరుగుతుంది. అలానే కోపం కూడా పెరుగుతుంది. మాంసాహారాన్ని తీసుకున్న తర్వాత నీరసం బాగా వస్తుంది. జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
నిజానికి జీవ హింస చేయకూడదు. మానవుడు ఆహారాన్ని కనుగొనక ముందు మాంసాన్ని కాల్చుకుని తినడం మొదలుపెట్టారు. అప్పట్లో అంటే ఆహారం లేక తిన్నారు. ఈ రోజుల్లో రకరకాల వంటలు మనం చేసుకోవచ్చు. శాకాహారం తీసుకునే వాళ్ళకి ఆయువు ఎక్కువ రోజులు ఉంటుంది. మాంసాహారాన్ని తీసుకున్న తర్వాత అది పూర్తిగా అరిగే వరకు ఒకటి రెండు రోజులు ఏమీ తినకుండా ఉండడం మంచిది. జంతువులు ఎప్పుడైనా సరే మాంసాహారం తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు ఏమీ తినవు. కాబట్టి జంతువుకి ఆ మాంసాహారం పడుతుంది.
మనిషి మాత్రం రోజు తింటూనే ఉంటాడు కాబట్టి మాంసం ఎక్కువ తినడం మంచిది కాదు. చాలామంది మాంసాహారం తింటే బరువు పెరగచ్చు. లావు అవ్వచ్చు. లేదంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ మాంసాహారమే అందుకు తినక్కర్లేదు. శాకాహారంలో కూడా ఎన్నో పోషకాహార పదార్దాలు ఉన్నాయి. మాంసానికి బదులుగా మీరు శాకాహారంలో ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చు. నిజానికి ప్రతిరోజు ఆకుకూరలు, పప్పులు, కాయగూరలు తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…