Chapati : స్థూలకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. మారిన జీవన ప్రమాణాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వలన పెరిగిన శారిరక బరువు పెద్ద సమస్యగా మారింది. దీంతో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేసే మొదటి పనుల్లో తినే ఆహారాన్ని తగ్గించుకోవడం లేదంటే అన్నం బదులు చపాతీలు తినడం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతీలను తినేవాళ్లు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.
చపాతీలని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనే వేయకుంటే మరింత మంచిది. పని ఒత్తిడిలో ఏ అర్థరాత్రో భోజనం చేసి వెంటనే కునుకు తీస్తుంటారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి,నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. అలా చేయలేని వారికి చపాతీలను తీసుకోవడం ఉత్తమం. ప్లేట్ నిండుగా భోజనం చేసినా 2, 3 చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. ఏదైనా అతి అనర్థదాయకమే. కాబట్టి చపాతీలు మితంగానే తీసుకోవాలి. ప్లేట్ నిండా అన్నం తింటాం కదా అని ప్లేట్ నిండా చపాతీలు తింటే ఇంక ఏం ఉపయోగం ఉండదు. కనుక 2 చపాతీలకు మించకుండా తినాలి.
మనదేశంలో ఎక్కువ మంది రక్త హీనతతో కూడా బాదపడుతున్నారు. చపాతీలను తినడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. నిద్ర పోయేప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చవుతుంది. మనలోని క్యాలరీలు ఏమాత్రం తగ్గవు. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాక పోవడంతో కొవ్వుగా మిగిలి పోయి మనిషి లావు అయ్యే ప్రమాదం ఉంటుంది. గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. ఎక్కువగా విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. అందువల్ల రాత్రి పూట చపాతీలను తింటే బరువు పెరగరు. పైగా బరువు తగ్గుతారు. ఇలా చపాతీలను రాత్రి పూట తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…