Chapati : స్థూలకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. మారిన జీవన ప్రమాణాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వలన పెరిగిన శారిరక బరువు పెద్ద సమస్యగా మారింది. దీంతో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేసే మొదటి పనుల్లో తినే ఆహారాన్ని తగ్గించుకోవడం లేదంటే అన్నం బదులు చపాతీలు తినడం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతీలను తినేవాళ్లు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.
చపాతీలని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనే వేయకుంటే మరింత మంచిది. పని ఒత్తిడిలో ఏ అర్థరాత్రో భోజనం చేసి వెంటనే కునుకు తీస్తుంటారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి,నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. అలా చేయలేని వారికి చపాతీలను తీసుకోవడం ఉత్తమం. ప్లేట్ నిండుగా భోజనం చేసినా 2, 3 చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. ఏదైనా అతి అనర్థదాయకమే. కాబట్టి చపాతీలు మితంగానే తీసుకోవాలి. ప్లేట్ నిండా అన్నం తింటాం కదా అని ప్లేట్ నిండా చపాతీలు తింటే ఇంక ఏం ఉపయోగం ఉండదు. కనుక 2 చపాతీలకు మించకుండా తినాలి.
మనదేశంలో ఎక్కువ మంది రక్త హీనతతో కూడా బాదపడుతున్నారు. చపాతీలను తినడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. నిద్ర పోయేప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చవుతుంది. మనలోని క్యాలరీలు ఏమాత్రం తగ్గవు. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాక పోవడంతో కొవ్వుగా మిగిలి పోయి మనిషి లావు అయ్యే ప్రమాదం ఉంటుంది. గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. ఎక్కువగా విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. అందువల్ల రాత్రి పూట చపాతీలను తింటే బరువు పెరగరు. పైగా బరువు తగ్గుతారు. ఇలా చపాతీలను రాత్రి పూట తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…