Green Color On Potatoes : నిత్యం మీరు తింటున్న ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారా..? లేదా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే వాటిలో హానికర విష పదార్థాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ అలాంటి ఆహారాన్ని మీరు చూడకుండా తింటే.. ఇక అంతే సంగతులు. అనారోగ్యాల పాలు కావల్సి వస్తుంది. ఒక్కోసారి అది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే ఆహారంలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుస్తుంది..? ఎలా తెలుసుకోవాలి..? చూద్దాం పదండి. ముందుగా బంగాళాదుంపల విషయానికి వద్దాం. వీటిలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మీరు కొన్న ఆలుగడ్డల్లో ఎక్కడైనా వాటి సహజ రంగులో కాక ఆకుపచ్చ రంగులో ఉన్న ఆలుగడ్డలు కనిపించాయా..? అయితే వెంటనే వాటిని తీసేయండి. ఎందుకంటే అవి విషపూరితంగా ఉంటాయి. వీటిని తింటే నరాల వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయట. ఇప్పుడు కోడిగుడ్లు. కోడిగుడ్లను పగలగొట్టిన తరువాత వాటిలో ఉండే తెల్ల, పచ్చని సొనలు కలసి కట్టుగా, విడదీయరాకుండా ఉన్నాయా? అయితే అవి కూడా హానికరమేనట. వెంటనే వాటిని పారేయండి. మనలో అధిక శాతం మందికి బ్రెడ్ అంటే ఇష్టం. అయితే దీన్ని తాజాగానే తినాలి. బూజు పట్టిందాన్ని అస్సలు తినకూడదు. ఒకవేళ కొద్దిగా బూజు పడితే దానంత వరకు తీసేసి మిగతాది తిన్నా హానికరమేనట. ఇవి క్యాన్సర్ రోగాలను తెచ్చిపెడతాయట.
నిల్వ ఉంచిన డ్రై ఫుడ్, పాప్ కార్న్ వంటివి వాసన వస్తే వాటిని పారేయాల్సిందే. లేదని తింటే మనకు అనారోగ్యాలను తెచ్చి పెడతాయి. ఆహార పదార్థాలను ఉంచే షెల్ఫ్లను (ఫ్రిజ్లోనైనా, బయటైనా) కనీసం వారానికోసారి అయినా క్లీన్ చేయాలట. లేదంటే వాటికి అంటుకుని ఉండే బ్యాక్టీరియా ఇతర వంటకాల్లోకి కూడా ప్రవేశిస్తుందట. దీంతో ఆహారాలు త్వరగా పాడవుతాయి. కనుక రోజూ మీరు తినే ఆహారాల విషయంలో ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…