Food Combinations : ముద్దపప్పులో పప్పుచారు కలుపుకొని తింటే ఉంటుంది చూడండి ఆ మజానే వేరు. అలాగే పచ్చి పులుసులో బంగాళాదుంప ప్రై, గట్టిపప్పులో ఆవకాయ్ ఇలా.. రకరకాల కాంబినేషన్స్ రుచికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. వంటింట్లో ఉన్న అమ్మను.. అమ్మా ఈ రోజు దోసకాయ్ పప్పు వండవే.. అంటూ టీవీ రూమ్ లో కూర్చొని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ కాంబినేషన్ కు ఉన్న టేస్ట్ అది. కానీ కొన్ని కాంబినేషన్లు మనకు హానిని కూడా కలిగిస్తాయి. అటువంటి కాంబినేషన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. స్టార్చీ కార్బొహైడ్రేట్స్ చిలగడ దుంపల్లో ఉంటాయి. కార్బొహైడ్రేట్స్తో సిట్రిక్ యాసిడ్ కలిపి తింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది. భోజనం తర్వాత అలసటగా అనిపిస్తుంది. కనుక టమాటాలు, చిలగడ దుంపలను కలిపి తినరాదు. అలాగే పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. వీటిని భోజనంతో కలిసి తీసుకోవడం వల్ల భోజనంలో ఉండే పోషకాలు త్వరగా జీర్ణం కావు. కాబట్టి వాటితోపాటు పండ్లు కూడా జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది. సో.. ఆలోపే పండ్లు కుళ్లిపోతాయ్. దాని కారణంగా పేగులోని లోపలి పొర దెబ్బతింటుంది. కనుక భోజనాన్ని, పండ్లను కలపరాదు. కాస్త గ్యాప్ ఇచ్చి తినాలి.
మాంసం ఉత్పత్తుల్లోని మాంసకృత్తులు పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని మాక్రో న్యూట్రియెంట్స్ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు కలిసిపోవడం వల్ల కడుపులో గ్యాస్ పుడుతుంది. దాంతో కడుపు ఉబ్బరిస్తుంది. కనుక మాంసంతో పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోరాదు. అలాగే పాల ఉత్పత్తులు సైనస్ లను మూసేస్తాయి. జలుబు, ఇతర అలర్జీలను పెంచుతాయి. ఈ ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి. కాబట్టి పెరుగును, పళ్లను విడివిడిగా తినాలి. రెండింటినీ కలిపి తినరాదు. ఇలా ఈ ఫుడ్ కాంబినేషన్స్కు దూరంగా ఉంటే.. ఆరోగ్యంగా ఉండవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…