Weight Gain : మనలో చాలా మంది బరువు పెరగడానికి కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉండాల్సిన బరువు కంటే కూడా తక్కువ బరువు ఉంటారు. అయితే కొందరిలో బరువు తక్కువగా ఉండడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. రక్తహీనత, నీరసం, బలహీనత, ఏపని మీద శ్రద్ద పెట్టలేకపోవడం, పోషకాహార లోపం వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం మన వయసుకు తగినంత బరువు ఉండడం చాలా అవసరం. చాలా మంది బరువు పెరగడానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల మందులను, సిరప్ లను, పౌడర్లను వాడుతూ ఉంటారు. కానీ వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం లేక మరలా నిరుత్సాహ పడుతూ ఉంటారు. అలాగే మరికొందరు బరువు పెరగాలని జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం వీలైనంత వరకు ఆరోగ్యంగా బరువు పెరగాలి. బరువు పెరగాలనుకునే వారు ప్రోటీన్ లు మరియు మంచి కొవ్వులు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలన్నా ముందుగా మనకు ఆకలి ఎక్కువగా ఉండాలి. కనుక రోజూ ఉదయమే లీటర్ నుండి లీటర్నర నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రమవుతుంది. దీంతో ఆకలి పెరుగుతుంది. బరువు పెంచేలా చేయడంలో మనకు పల్లీలు ఎంతో సహాయపడతాయి. వీటిలో ప్రోటీన్లు, ఫ్యాట్ లు ఎక్కువగా ఉంటాయి. పల్లీలల్లో 50 శాతం ఫ్యాట్, 25 శాతం ప్రోటీన్ ఉంటుంది. అలాగే పచ్చి కొబ్బరిలో కూడా ఫ్యాట్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక రోజూ ఉదయం నానబెట్టిన పల్లీలను, కొబ్బరిని కలిపి తీసుకోవాలి.
వీటితో పాటు మనకు నచ్చిన వివిధ రకాల పండ్లను తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం పూట కొర్రలు, సామలు, జొన్నలు, బియ్యంతో వండిన 70 శాతం తీసుకోవాలి. కూరలను 30 శాతం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినన్ని కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. నీరసం తగ్గుతుంది. అదే విధంగా సాయంత్రం పూట పుచ్చగింజల పప్పు, పొద్దు తిరుగుడు పప్పు, గుమ్మడి గింజలు, డ్రై నట్స్ ను నానబెట్టి తీసుకోవాలి. అలాగే 2 నుండి 3 అరటి పండ్లను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు పెరగవచ్చు. కనీసం నెలకు రెండు కిలోల వరకు బరువు సులభంగా పెరగవచ్చు. ఈ విధంగా చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కగా కండపడతారు. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. వేగంగా బరువు పెరగవచ్చు. బరువు పెరగాలనుకునే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…