సాధారణంగా కొందరిలో రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు నలుగురిలో కలిసి మాట్లాడలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మద్యపానం ధూమపానం తంబాకు అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. అదేవిధంగా కొందరిలో ఏ విధమైనటువంటి చెడు అలవాటు లేకున్నప్పటికీ వారికి నోటి దుర్వాసన సమస్య వెంటాడుతోంది. ఈ విధంగా నోటి దుర్వాసన రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మన నోరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వెలువడే దుర్వాసన, మరొకటి కడుపులో జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగా లేనప్పుడు నోటినుంచి ఈ విధమైనటువంటి దుర్వాసన వెలువడుతుంది. ఈ విధంగా వచ్చే నోటి దుర్వాసనను ‘హాలిటోసిస్’ అంటారు. మరి ఈ నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించాల్సిందే.
*నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కోవాలంటే తరచూ తులసి, జామ, పుదీనా, యూకలిప్టస్ వంటి ఆకులను నమలడం ద్వారా నోటిలో ఏర్పడిన బ్యాక్టీరియాలో తొలగిపోయి నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
*ప్రతి రోజు భోజనం తర్వాత ఏలక్క, కొత్తిమీర, పుదీనా, లవంగం నోటిలో పెట్టుకుని చప్పరించడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
*ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తాజా పెరుగును తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి సమస్య నుంచి విముక్తి పొందవచ్చని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పెరుగును తరచూ తినడం వల్ల దంతాలపై ఏర్పడిన పాచీ, చిగుళ్ల సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
*పీచు పదార్థాలు అధికంగా కలిగి ఉన్న పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల అధిక లాలాజలం ఉత్పత్తి అయి నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది.
*ఈ విధంగా నోటి దుర్వాసనతో బాధపడేవారు ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక నోటి దుర్వాసనను అదుపుచేయడానికి దోహద పడుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…