Ayurveda Tips : ప్రతిరోజూ ఈ ఆయుర్వేద సూత్రాలని పాటిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. ప్రతిరోజూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా కూడా ప్రతి రోజూ స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండచ్చు. ప్రతిరోజూ శిరస్సు, ముక్కు, పాదాలకి నూనె రాసుకుంటే మంచిది. మలమూత్ర మార్గాలని, పాదాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
వెంట్రుకలను, గోళ్ళని 15 రోజులకి మూడుసార్లు కత్తిరించుకోవాలి. పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం చాలా ముఖ్యం. భయం లేకుండా ధైర్యవంతుడిగా ఉంటే జీవితంలో పైకి వస్తారు. ఏదీ ఆలోచిస్తూ భోజనం చేయకూడదు. ప్రతిరోజూ సమయానికి భోజనం చేయాలి. రాత్రి కానీ ఉదయం కానీ భోజనం చేయకుండా ఉండడం అసలు మంచిది కాదు. అజీర్తి సమస్యలు లేకుండా చూసుకోవాలి.
తిన్న వెంటనే మళ్ళీ తింటే కూడా ఆరోగ్యం పాడవుతుంది. రోజూ అన్ని రకాల రుచులను తీసుకోవాలి. ఎప్పుడూ ఒకే రుచి తీసుకోవడం వలన బలహీనతకి కారణమవుతుంది. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన అనేక రోగాలు కలుగుతాయి. పాలు, పెరుగు తృప్తిగా తింటే ముసలితనం త్వరగా రాదు. విరుద్ధ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. అనేక సమస్యలు కలుగుతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే నువ్వుల నూనెని నోట్లో వేసుకుని తెల్లని నురగ వచ్చే వరకు పుక్కిలించి ఆ తర్వాత బయటకి వదిలేయాలి. దీనినే ఆయిల్ పుల్లింగ్ అంటారు. దీని వలన దంతాలు బలంగా ఉంటాయి. దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా రావు.
నెయ్యి తీసుకున్నప్పుడు ఆవు నెయ్యిని తీసుకోవడం శ్రేష్టం. పప్పు ధాన్యాలలో పెసలు చాలా ఉత్తమమైనవి. ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టమైనది. దుంపలలో అల్లం శ్రేష్టం. ఫలముల్లో ద్రాక్ష శ్రేష్టం. ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం. చెరుకు నుండి తయారయ్యే బెల్లం శ్రేష్టం. మినుములని అతిగా వాడకండి. మలమూత్ర వేగములని ఆపకూడదు. ఆహారం అరగకపోయినప్పుడు ఆహారాన్ని ద్రవ రూపంలో తీసుకుంటే మంచిది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గములకి అడ్డు పడుతుంది. గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…