నిత్యం మసాలా వంటలు తిని కొన్నిసార్లు మన నాలుక రుచి తప్పిపోతుంది. ఇలాంటి సమయంలోనే చట్నీలు చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. మరి నోటికి రుచిగా అనిపించే టమోటో – వెల్లుల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*బాగా పండిన టమోటాలు 5
*పచ్చిమిర్చి 10
*ఉల్లిపాయ ఒకటి
*వెల్లుల్లి రెబ్బలు పది
*ఉప్పు తగినంత
*నూనె తగినంత
*కొత్తిమీర తురుము కొద్దిగా
ముందుగా బాగా పండిన టమోటా పండ్లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయను సన్నటి పొడవాటి ముక్కలుగా కత్తిరించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత వాటిని పక్కకు తీసి అదే గోళంలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న టమోటో ముక్కలు వేసి కొద్దిగా నూనె వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా టమోటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కాసేపు చల్లారనివ్వాలి.
ఈ పదార్థాలన్నీ చల్ల పడగానే ముందుగా రోలులో కొద్దిగా ఉప్పు వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా రుబ్బాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయను మెత్తగా అయిన తర్వాత టమోటాలు వేసి బాగా రుబ్బాలి. ఈ మిశ్రమంలోకే కొత్తిమీర తురుము వేసి మరొకసారి రుబ్బితే ఎంతో రుచికరమైన టమోటో వెల్లుల్లి చట్నీ తయారైనట్లే. దీనిని మనం వేడి వేడి అన్నంలోకి లేదా రాగి ముద్ద కాంబినేషన్ లో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…