మనం ఎన్ని వంటకాలు చేసిన అందులో కొన్ని వంటకాలు లేకపోతే ఆ వంటకాలు రుచి ఉండదు. అలాంటి వాటిలో ఆంధ్ర స్పెషల్ కంది పప్పు పొడి ఒకటి అని చెప్పవచ్చు. తినడానికి ఎంతో రుచిగా ఉండే కంది పప్పు పొడిని ఒక్కసారి తింటే మరీ మరీ తినాలనిపిస్తుంది. మరి ఈ రుచికరమైన కంది పప్పు పొడి ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*కందిపప్పు కప్పు
*పప్పులు ఒక కప్పు
*ఎండు మిరపకాయలు 10
*వెల్లుల్లి రెబ్బలు 15
*కరివేపాకు సరిపడేంత
*ఇంగువ అర టీ స్పూన్
*జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు
*మెంతులు అర టీ స్పూన్
ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి కందిపప్పును, ఆ తర్వాత పప్పులను దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా కందిపప్పును వేయించుకున్న తరువాత అదే బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి.బాగా వీటిని వేయించుకున్న తరువాత మిక్సీ గిన్నెలో వేసి తగినంత ఉప్పు ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి ముందుగా వేయించి పెట్టుకున్న కందిపప్పు, పప్పులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన కంది పప్పు పొడిని మనం ఇడ్లీ నుంచి మొదలుకొని ఉప్మా, ఉగ్గాని, బజ్జీలు వంటి వాటిలోకి తినడమే కాకుండా, వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కలుపుకుని తింటే ఆ రుచి వర్ణించలేనిది అని చెప్పవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…