మీకు ఏమైనా తినాలనిపిస్తుందా.. అయితే మన ఇంట్లో గోధుమరవ్వ ఉంటే చాలు ఎంతో రుచికరమైన పాయసం క్షణాలలో రెడీ చేయవచ్చు. ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ పాయసం చేయడం ఎలానో ఇక్కడ తెలుసుకుందాం.
*గోధుమ రవ్వ ఒక కప్పు
*నెయ్యి కొద్దిగా
*బెల్లం ఒకటిన్నర కప్పు
*కొబ్బరి పాలు రెండు కప్పులు
*ఏలకుల పొడి రెండు టేబుల్ స్పూన్లు
*జీడిపప్పు, ఎండు ద్రాక్ష గుప్పెడు
*నీళ్లు తగినన్ని
ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరి కొద్దిగా నెయ్యి వేసి గోధుమ రవ్వను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో బెల్లం తగినన్ని నీళ్లు వేసి బాగా ఉడికించాలి.ఉడుకుతున్న మిశ్రమంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమరవ్వ వేసి చిన్న మంటపై బాగా కలియబెడుతూ, రవ్వ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొబ్బరి పాలు, యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికిన పాయసంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ పాయసం తయారైనట్లే.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…