సాధారణంగా మాంసాహారులైతే చికెన్ లాలిపాప్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ శాఖాహారులు కూడా ఆ విధమైనటువంటి అనుభవాన్ని పొందాలనుకునే వారికి పొటాటో లాలీపాప్స్ ఒక మంచి స్నాక్స్ ఐటమ్ అని చెప్పవచ్చు.మరి పొటాటో లాలీపాప్స్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*బంగాళాదుంపలు 2
*పచ్చిమిర్చి ముక్కలు టీ స్పూన్
*కొత్తిమీర తురుము రెండు టేబుల్ స్పూన్లు
*పసుపు చిటికెడు
*కారం పొడి టీ స్పూన్
*జీలకర్ర చిటికెడు
*నిమ్మరసం టేబుల్ స్పూన్
*ధనియాల పొడి అర టీ స్పూన్
*ఉప్పు రుచికి సరిపడినంత
*అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్
*చాట్ మసాలా టీ స్పూన్
*మైదా పిండి ఒక టేబుల్ స్పూన్
*బ్రెడ్ పౌడర్ ఒకటిన్నర కప్పు
*నీళ్లు సరిపడినంత
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
ముందుగా బంగాళదుంపలను మెత్తగా ఉడకబెట్టి వాటి తోలు తీసి బాగా చిదిమి పెట్టుకోవాలి. ఈ బంగాళా దుంప మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొద్దిగా బ్రెడ్ పొడి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, చాట్ మసాలా వేసి చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. మన చేతికి నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేయాలి. ఒక పాత్రలో మైదా పిండికి కొద్దిగా నీళ్లు జతచేసి దోసె పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప ఉండలను మైదా పిండిలో ముంచి వెంటనే బ్రెడ్ పొడిలో అటు ఇటు దొర్లించాలి.ఈ దొర్లిన ఉండలను బాగా మరుగుతున్న నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఈ ఉండలను లాలీపాప్ స్టిక్స్ గుచ్చి టమాటో కెచప్ తో తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…