చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రతిసారీ ఒకే రకంగా తయారు చేసుకొని తినడంతో బోర్ కొడుతుంది. అలాంటప్పుడే కొద్దిగా వెరైటీగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ పాలకూర చికెన్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*చికెన్ 300 గ్రాములు
*పాలకూర 300 గ్రా
*పచ్చిమిర్చి4
*అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు
*యాలకులు 4
*లవంగాలు 4
*దాల్చినచెక్క రెండు
*నూనె తగినంత
*గరం మసాలా పొడి ఒక స్పూన్
*కారం పొడి టేబుల్ స్పూన్
*పసుపు
*ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు
ముందుగా చికెన్ ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ లో పాలకూర మిరపకాయలు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ తీసి కుక్కర్ మూత తీయాలి. ఈ విధంగా పాలకూర చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
తరువాత స్టవ్ పై ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయ్యాక అందులోకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయాలి. అవి దోరగా వేగిన తర్వాత అందులోకి చికెన్ వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ నూనెలో మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి.అవసరమైతే చికెన్ ముక్కలు మెత్తగా కావడం కోసం కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి. చికెన్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పాలక్ మిశ్రమాన్ని అందులో వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన పాలకూర చికెన్ తయారైనట్టే.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…