Masala Tea : ప్రతి ఒక్కరు కూడా, టీ ని ఇష్టపడుతూ ఉంటారు. టీ, కాఫీలు ని చాలామంది ఎక్కువసార్లు రోజుల్లో తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీ తీసుకుంటే, ఏదో తెలియని ఎనర్జీ మనలో వస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే, ఆరోగ్యానికి ఇబ్బంది. కానీ లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. అయితే, ఇలా కనుక మీరు టీ ని తయారు చేశారంటే కచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. మంచి రంగు, రుచి, వాసన కలిగిన టీ ఇది. టీ ని ఎలా తయారు చేసుకోవాలి..? ఎలా ఇంట్లో వాళ్ళని ఫిదా చేసేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.
పాలు బాగా మరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి, పాలను బాగా మరిగించండి. ఆ తర్వాత పాలను తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి, రెండు కప్పులు నీళ్లు పోసుకోండి. నీళ్లు బాగా మరిగేంత వరకు మూత పెట్టి, మరిగించుకోండి. చెక్కు తీసిన అల్లాన్ని కొంచెం దంచేసి వేసుకోండి. ఒక నాలుగు, ఐదు యాలకులను కూడా ఈ నీళ్లలో వేసేయండి. ఒక నాలుగు లవంగాలని కూడా వేసుకోండి.
కొంచెం దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. అలానే మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి కూడా వేసుకోండి. టీ పొడి వేసాక మూత పెట్టేసుకోండి. బాగా తయారవుతుంది. ఇది బాగా మరిగిన తర్వాత, కాచిన పాలని రెండు కప్పులు పోసుకోవాలి.
పాలు వేసేటప్పుడు చల్లటి పాలని ఎప్పుడూ మిక్స్ చేయకండి. గోరువెచ్చని పాలు నయినా తీసుకోవచ్చు. కానీ, చల్లటి పాలని తీసుకోవద్దు. ఇది మరిగించుకున్నాక, గులాబీ రేకుల్ని వేసుకోండి, ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోండి. తర్వాత ఒక గరిటను తీసుకుంటూ కలుపుతూ మళ్ళీ మరిగించుకోండి. ఇక, వడకట్టుకుని వేడివేడిగా టీ ని ఆస్వాదించడమే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…