ప్రస్తుత కాలంలో మనం ఉపయోగించే వంటలలో ఎక్కువ భాగం చక్కెరను ఉపయోగిస్తున్నాము. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోజనాలు కలిగిన బెల్లం పక్కన పెట్టడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన బెల్లం ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
*బెల్లంలో మనకు ఎక్కువగా ఐరన్, పొటాషియం, సోడియం, క్యాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువ భాగం లభిస్తాయి. మన శరీరంలో అధిక రక్తపోటు సమస్యను తగ్గించడమే కాకుండా రక్తం వృద్ధి చెందడానికి దోహదపడుతుంది.
*ఆస్తమా బ్రాంకైటిస్ వంటి జబ్బులతో బాధపడేవారు క్రమం తప్పకుండా బెల్లాన్ని నువ్వులతోపాటు కలిపి తినటం వల్ల ఈ విధమైనటువంటి ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యలు నుంచి విముక్తి పొందవచ్చు.
*అజీర్ణ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత కాస్త బెల్లం ముక్క తినడం ద్వారా జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి.
*అధిక శరీర బరువు పెరిగే వారు శరీర బరువును నియంత్రించుకోవడం కోసం బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు 100 గ్రాముల బెల్లం చొప్పున తీసుకోవటంవల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.
*సాధారణంగా వయసు పైబడే కొద్దీ చాలామంది ఎదుర్కొనే సమస్యలలో కీళ్లనొప్పి సమస్య ఒకటి. ఈ విధంగా కీళ్లనొప్పులతో బాధపడేవారు బెల్లం ముక్కతో పాటు కాస్త అల్లం కలిపి తినటం వల్ల తొందరగా ఈ విధమైనటువంటి నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు.
*ప్రతిరోజు మనం పాలలోకి చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా తయారవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మహిళలలో వచ్చే నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…