Angry : కోపం అనేది చాలా మందికి వచ్చే ఓ సహజ సిద్ధమైన చర్య. కొందరికి పట్టరానంత కోపం వస్తే కొందరికి వచ్చే కోపం సాధారణంగానే ఉంటుంది. దాన్ని ఎలాగైనా వారు అణచుకుంటారు. కానీ ఇంకా కొందరు ఉంటారు.. అలాంటి వారికి కోపం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి స్థితిలో వారు ఏం చేస్తారో వారికే తెలియదు. తిడతారు లేదంటే కొడతారు. ఇంకొందరు తమ దగ్గర అందుబాటులో ఉన్నవి విసిరేస్తారు. ఈ క్రమంలో అలాంటి వారికి వచ్చే కోపం ఓ పట్టాన తగ్గదు. దీంతో వారిని చూసే వారికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే అందుకు ఓ పరిష్కారం ఉందండోయ్. ఏంటి..? అంటారా..? అదేంటో మీరే చదివి తెలుసుకోండి..!
ఎవరికైనా పట్ట రానంత కోపం వస్తే వెంటనే వారి నోట్లో కాస్తంత చక్కెర పోయాలట. దీంతో వారి కోపం ఇట్టే తగ్గిపోతుందట. ఇది మేం చెబుతోంది కాదు. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలిన నిజం. ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పలువురు పరిశోధకులు చక్కెరకు, కోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇటీవలే కనుగొన్నారు. అదేమిటంటే.. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు దాన్ని అణచుకోవాలంటే వారికి అధిక మొత్తంలో శక్తి కావల్సి వస్తుందట. అందుకు శరీరంలో గ్లూకోజ్ బాగా అవసరం అవుతుంది.
ఈ క్రమంలో అలా శరీరానికి గ్లూకోజ్ ఇచ్చేందుకు చక్కెర తినాలి. చక్కెరలో బాగా క్యాలరీలు, గ్లూకోజ్ ఉంటాయి కదా. అవి వెంటనే శరీరంలో చేరి ఆ వ్యక్తికి కావల్సిన శక్తిని అందిస్తాయి. దీంతో వారి కోపం ఇట్టే తగ్గుతుందట. దీన్ని పైన చెప్పిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అయితే చక్కెర అందుబాటులో లేకపోతే చక్కెర కలిపిన పానీయం లేదా చక్కెర కలిపిన నిమ్మకాయ నీళ్లు వంటివి తాగవచ్చట. అలా చేసినా కోపం అదుపులోకి వస్తుందట. ఇంకెందుకాలస్యం మరి..! మీ చుట్టూ అలా కోపం బాగా వచ్చే వారు ఎవరైనా ఉంటే వారి నోట్లో ఓ గుప్పెడు చక్కెర పోసేయండి.. దాంతో వచ్చే ఫలితం మీరే చూస్తారు..!
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…