Angry : కోపం అనేది చాలా మందికి వచ్చే ఓ సహజ సిద్ధమైన చర్య. కొందరికి పట్టరానంత కోపం వస్తే కొందరికి వచ్చే కోపం సాధారణంగానే ఉంటుంది. దాన్ని ఎలాగైనా వారు అణచుకుంటారు. కానీ ఇంకా కొందరు ఉంటారు.. అలాంటి వారికి కోపం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి స్థితిలో వారు ఏం చేస్తారో వారికే తెలియదు. తిడతారు లేదంటే కొడతారు. ఇంకొందరు తమ దగ్గర అందుబాటులో ఉన్నవి విసిరేస్తారు. ఈ క్రమంలో అలాంటి వారికి వచ్చే కోపం ఓ పట్టాన తగ్గదు. దీంతో వారిని చూసే వారికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే అందుకు ఓ పరిష్కారం ఉందండోయ్. ఏంటి..? అంటారా..? అదేంటో మీరే చదివి తెలుసుకోండి..!
ఎవరికైనా పట్ట రానంత కోపం వస్తే వెంటనే వారి నోట్లో కాస్తంత చక్కెర పోయాలట. దీంతో వారి కోపం ఇట్టే తగ్గిపోతుందట. ఇది మేం చెబుతోంది కాదు. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలిన నిజం. ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పలువురు పరిశోధకులు చక్కెరకు, కోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇటీవలే కనుగొన్నారు. అదేమిటంటే.. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు దాన్ని అణచుకోవాలంటే వారికి అధిక మొత్తంలో శక్తి కావల్సి వస్తుందట. అందుకు శరీరంలో గ్లూకోజ్ బాగా అవసరం అవుతుంది.
ఈ క్రమంలో అలా శరీరానికి గ్లూకోజ్ ఇచ్చేందుకు చక్కెర తినాలి. చక్కెరలో బాగా క్యాలరీలు, గ్లూకోజ్ ఉంటాయి కదా. అవి వెంటనే శరీరంలో చేరి ఆ వ్యక్తికి కావల్సిన శక్తిని అందిస్తాయి. దీంతో వారి కోపం ఇట్టే తగ్గుతుందట. దీన్ని పైన చెప్పిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అయితే చక్కెర అందుబాటులో లేకపోతే చక్కెర కలిపిన పానీయం లేదా చక్కెర కలిపిన నిమ్మకాయ నీళ్లు వంటివి తాగవచ్చట. అలా చేసినా కోపం అదుపులోకి వస్తుందట. ఇంకెందుకాలస్యం మరి..! మీ చుట్టూ అలా కోపం బాగా వచ్చే వారు ఎవరైనా ఉంటే వారి నోట్లో ఓ గుప్పెడు చక్కెర పోసేయండి.. దాంతో వచ్చే ఫలితం మీరే చూస్తారు..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…