కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను ఆగమాగం చేసింది. ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. మన దేశంలో ప్రజలపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఉపాధి కోల్పోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల కోసం వెంట బెట్టుకెళ్తున్నారు. ఇక కొందరు విద్యార్థులు ఓ వైపు పనిచేస్తూనే మరోవైపు చదువుకుంటున్నారు. వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు.
ఢిల్లీలోని కన్నాట్ అనే ప్రాంతం. కేజీ మార్గ్లో రద్దీగా ఉండే రహదారి. ఆ రహదారికి పక్కన ఫుట్పాత్పై ఓ బాలిక చదువుకుంటోంది. పైన మీరు చూస్తున్న చిత్రం అదే. ఆమెకు చదువుకోవాలనే ఆరాటం. కానీ పాపం కోవిడ్ వల్ల తల్లిదండ్రులకు ఉపాధి పోయింది. దీంతో చదువుకోవడం కష్టమైంది. ఆమె ఇద్దరు సోదరిలు ఆమెతోపాటు అక్కడి పీరాగర్హిలో ఉన్న సర్వోదయ కన్యా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఆమె పేరు భూమిక.
తన ఇద్దరి సోదరిలు తల్లిదండ్రులతోపాటు కూలి పనులకు వెళ్తున్నారు. కానీ భూమిక మాత్రం ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఫుట్పాత్ మీద బర్డ్ ఫుడ్ విక్రయిస్తోంది. రోజూ అది అమ్మి ఎంతో కొంత సొమ్మును ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. కానీ చదువుకోకపోతే ఎలా ? అందుకనే ఆమె ఓవైపు బర్డ్ ఫుడ్ అమ్ముతూ, మరోవైపు చదువును కొనసాగిస్తోంది. పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండవు కదా, మాకూ మంచిరోజులు వస్తాయి, నేను చదువుకుని పోలీస్ ఆఫీసర్ను అవుతా.. అంటూ ఆ బాలిక ధైర్యంగా చెబుతోంది. ఆమె కల నెరవేరాలని కోరుకుందాం.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…