కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను ఆగమాగం చేసింది. ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. మన దేశంలో ప్రజలపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఉపాధి కోల్పోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల కోసం వెంట బెట్టుకెళ్తున్నారు. ఇక కొందరు విద్యార్థులు ఓ వైపు పనిచేస్తూనే మరోవైపు చదువుకుంటున్నారు. వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు.
ఢిల్లీలోని కన్నాట్ అనే ప్రాంతం. కేజీ మార్గ్లో రద్దీగా ఉండే రహదారి. ఆ రహదారికి పక్కన ఫుట్పాత్పై ఓ బాలిక చదువుకుంటోంది. పైన మీరు చూస్తున్న చిత్రం అదే. ఆమెకు చదువుకోవాలనే ఆరాటం. కానీ పాపం కోవిడ్ వల్ల తల్లిదండ్రులకు ఉపాధి పోయింది. దీంతో చదువుకోవడం కష్టమైంది. ఆమె ఇద్దరు సోదరిలు ఆమెతోపాటు అక్కడి పీరాగర్హిలో ఉన్న సర్వోదయ కన్యా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఆమె పేరు భూమిక.
తన ఇద్దరి సోదరిలు తల్లిదండ్రులతోపాటు కూలి పనులకు వెళ్తున్నారు. కానీ భూమిక మాత్రం ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఫుట్పాత్ మీద బర్డ్ ఫుడ్ విక్రయిస్తోంది. రోజూ అది అమ్మి ఎంతో కొంత సొమ్మును ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. కానీ చదువుకోకపోతే ఎలా ? అందుకనే ఆమె ఓవైపు బర్డ్ ఫుడ్ అమ్ముతూ, మరోవైపు చదువును కొనసాగిస్తోంది. పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండవు కదా, మాకూ మంచిరోజులు వస్తాయి, నేను చదువుకుని పోలీస్ ఆఫీసర్ను అవుతా.. అంటూ ఆ బాలిక ధైర్యంగా చెబుతోంది. ఆమె కల నెరవేరాలని కోరుకుందాం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…