జీవితంలో ఎన్నో కలలు కని ఆ కలలను నిజం చేసుకోవడానికి అత్తవారింట అడుగుపెట్టిన నవవధువు తన కాళ్ల పారాణి ఆరకముందే కాటికి కాలు చాపింది. పెళ్లి జరిగి 7 రోజులు కూడా జరగకుండానే ఆ వధువు ఏడడుగుల బంధానికి స్వస్తి పలికింది.ఇంటి ముందు పందిరి కూడా తీయకుండానే నవవధువు పరలోకానికి వెళ్లిపోవడంతో ఇరు కుటుంబాలు గుండెలవిసేలా చేసిన రోదనలు ఇతరులకు కన్నీరును తెప్పించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.
సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కుమార్తె అశ్వినీ స్వాతి అనే యువతికి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన కనుమురెడ్డి అశోక్తో గత నెల 29న వివాహం చేశారు. రెండు రోజుల కిందటే వధూవరులిద్దరూ వరుడి స్వగ్రామానికి వచ్చారు. అయితే ఆషాడమాసం వస్తున్న కారణంగా నవ వధువును పుట్టింటికి తీసుకెళ్లాలని, సోమవారం మంచి రోజు కావడంతో ఆమెను పుట్టింటికి పంపడానికి ప్రయాణం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అందరూ ఇంట్లో ఉండగానే స్వాతి లోపలికి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతికి అశోక్ వరుసకు మేనమామ అవుతాడు. అశోక్ తాపీ పని చేసేవాడు.ఈ క్రమంలోనే కొత్త ఇంటిని కట్టించి వివాహం చేసుకొని ఎన్నో ఆశలతో జీవితంలోకి అడుగుపెట్టిన అశోక్ అశ్విని మృతదేహం చూసి కుప్పకూలిపోయాడు. అయితే ఇరు కుటుంబాలు బంధువులు కావడంతో ఆమె మృతి చెందిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిగతా కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు రావడంతో అశ్వినీ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…