మన దేశంలో వివిధ రకాల విలువలతో కూడిన కరెన్సీ నోట్లు చెలామణీలో ఉన్నాయి. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 ఇలా అనేక నోట్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో రూ.1000 నోట్లు కూడా ఉండేవి. కానీ వాటిని, పాత రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2000 నోట్లను చెలామణీలోకి తెచ్చారు. అయితే మీకు తెలుసా ? సున్నా (0) రూపాయి నోట్లు కూడా చెలామణీలో ఉన్నాయి. కానీ నిజానికి వాటిని ఆర్బీఐ ప్రింట్ చేయదు. మరి ఈ సున్నా రూపాయి నోట్ల వెనుక అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
తమిళనాడుకు చెందిన 5th Pillar అనే ఓ ఎన్జీవో 2007లో ఈ సున్నా రూపాయి నోట్లను సృష్టించింది. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోయింది. ప్రజలకు ఉచితంగా సేవలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు, నేతలు లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లంచగొండితనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఆ ఎన్జీవో వారు సున్నా రూపాయి నోట్లను ప్రింట్ చేసి ప్రజలకు ఉచితంగా అందించడం మొదలు పెట్టారు.
ఎక్కడైనా, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు లంచం అడిగితే ఆ సున్నా రూపాయి నోట్లను వారికి ఇవ్వండని, అలాగే వారిపై ఫిర్యాదు చేయండని సదరు ఎన్జీవో వారు చెబుతున్నారు. అందుకోసమే వారు ఆ సున్నా రూపాయి నోట్లను ప్రింట్ చేశారు. ఆ సంస్థకు చెందిన వాలంటీర్లు ఆ నోట్లను ఇప్పటికే ఎన్నో లక్షల సంఖ్యలో పంచి పెట్టారు. అవి హిందీ, తెలుగు, కన్నడ, మళయాళం తదితర భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఆ నోట్లపై If anyone demands bribe, give this note and report the case. అనే సందేశం కూడా ప్రింట్ చేయబడి ఉంటుంది.
ఈ నోట్లను https://5thpillar.org/programs/zero-rupee-note/ అనే వెబ్సైట్ నుంచి మీరు కూడా ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా లంచం అడిగితే అసలు డబ్బుకు బదులుగా ఈ నోట్లను ఇచ్చి వారిని ఏసీబీకి పట్టించవచ్చు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…