మన శరీరానికి అవసరమైన పోషక విలువలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న నేరేడు పండ్లు సంవత్సరంలో వేసవి ప్రారంభం నుంచి తొలకరి వర్షాలు మొదలైన రెండు మూడు వారాల వరకు మాత్రమే లభ్యమయ్యే సీజనల్ ఫ్రూట్స్. నేరేడు పండ్లను సంస్కృతంలో జంబూ ఫలం అంటారు. నేరేడు పండ్లులో విటమిన్ సి అధికంగా ఉండడంతో మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి వర్షాకాలంలో వచ్చే అనేక సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.
నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పోటాషియం, కాల్షియం, పాస్ఫరస్, మాంగనీస్, జింక్, ఐరన్, విటమిన్ సి, రైబోఫ్లైవిన్, నికోటిన్ ఆమ్లం, కొలైన్, పోలిక్ ఆమ్లం వంటిది సమృద్ధిగా లభిస్తాయి. మధుమేహం సమస్య ఉన్న వారికి నేరేడు పండు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. దీనిని రోజూ తింటే రక్తపోటును అదుపులో ఉంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. నేరేడు పండ్లలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
అయితే నేరేడు పండ్లను ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. కావున ఈ పండ్లను ఎక్కువగా తిన్నప్పడు మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి గర్భిణీలు తినకపోవడమే మంచిది. నేరేడు పండ్లను తిన్న తర్వాత చాలా మందికి నోట్లో వెగటుగా ఉండి వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి. ఏ ఆహారమైనా మితంగా తింటే అది మనకు ఆరోగ్య దాయకంగా మారుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…