మన శరీరానికి అవసరమైన పోషక విలువలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న నేరేడు పండ్లు సంవత్సరంలో వేసవి ప్రారంభం నుంచి తొలకరి వర్షాలు మొదలైన రెండు మూడు వారాల వరకు మాత్రమే లభ్యమయ్యే సీజనల్ ఫ్రూట్స్. నేరేడు పండ్లను సంస్కృతంలో జంబూ ఫలం అంటారు. నేరేడు పండ్లులో విటమిన్ సి అధికంగా ఉండడంతో మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి వర్షాకాలంలో వచ్చే అనేక సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.
నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పోటాషియం, కాల్షియం, పాస్ఫరస్, మాంగనీస్, జింక్, ఐరన్, విటమిన్ సి, రైబోఫ్లైవిన్, నికోటిన్ ఆమ్లం, కొలైన్, పోలిక్ ఆమ్లం వంటిది సమృద్ధిగా లభిస్తాయి. మధుమేహం సమస్య ఉన్న వారికి నేరేడు పండు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. దీనిని రోజూ తింటే రక్తపోటును అదుపులో ఉంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. నేరేడు పండ్లలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
అయితే నేరేడు పండ్లను ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. కావున ఈ పండ్లను ఎక్కువగా తిన్నప్పడు మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి గర్భిణీలు తినకపోవడమే మంచిది. నేరేడు పండ్లను తిన్న తర్వాత చాలా మందికి నోట్లో వెగటుగా ఉండి వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి. ఏ ఆహారమైనా మితంగా తింటే అది మనకు ఆరోగ్య దాయకంగా మారుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…